Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Reviews Energy Efficiency

CM Chandrababu : ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Published Date :October 25, 2024 , 10:56 pm
By Gogikar Sai Krishna
  • నిర్వీర్యమైన వీధిదీపాల నిర్వహణ ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు సీఎం నిర్ణయం
  • గ్రామ
  • పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు రూ.150 కోట్లు విడుదలకు సీఎం అంగీకారం
  • 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌల వినియోగానికి నిర్ణయం
CM Chandrababu : ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu : రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.50 కోట్లను విడుదల చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇంధన వాడాకాన్ని తగ్గించేందుకు నూరు శాతం ఎల్ఈడి దీపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు వీధి దీపాల నిర్వహణకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదన్నారు. సాంకేతికతను వినియోగించి వీధి దీపాల నిర్వహణను మానిటరింగ్ చేసి విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఈడీ దీపాలు వినియోగించడం ద్వారా విద్యుత్ మిగులను 30 నుండి 60 శాతం వరకూ పెంచ వచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గత తెలుగు దేశం హయాంలో చేపట్టిన బెస్ట్ పాలసీలను మళ్లీ అమల్లోకి తెచ్చి ఇంధన సామర్థ్యంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్నారు. రాష్ట్రంలోని 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని, అందుకోసం ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వీధి దీపాల నిర్వహణతో పాటు సమర్ధ విద్యుత్ వినియోగానికి సంబంధించి నివేదిక ఇచ్చేందుకు ఆర్ధికశాఖ, ఇంధన శాఖతో పాటు ఈఈఎస్ఎల్ ప్రతినిధులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సిఇఓ విశాల్ కపూర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎనర్జీ ఎఫిషియెన్సీ అంశాలకు సంబంధించి వివిధ అంశాలను సియంకు వివరించారు.

  Breaking News: పాదయాత్రలో కేజ్రీవాల్‌పై దాడి.. బీజేపీ పనే?

Also Read

  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
  • Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
  • Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
  • Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!

ఈఈఎస్ఎల్ తో ప్రభుత్వం అవగాహనా ఒప్పందం
రాష్ట్రంలో 1.5 లక్షల గృహాలకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఉపకరణాలతో విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇఇఎస్ఎల్ సంస్థతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL), ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇఇఎస్ఎల్, హౌసింగ్ కార్పొరేషన్‌తో సమన్వయంతో అదనంగా మరో 9 లక్షల ఇళ్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి పి.నారాయణ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి జానకి, సియం కార్యదర్శి ప్రద్యుమ్న, ఎండి జెన్కో చక్రధర్ బాబు, ఎపి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ సిఇఓ విశాల్ కపూర్,ఇతర ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Viral Video: షోరూం ముందే కాలిపోయిన ఓలా స్కూటర్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • EESL
  • energy efficiency
  • energy savings

తాజావార్తలు

  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ

  • Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం

  • Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

  • Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?

  • Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions