CM Chandrababu: మునిసిపల్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష.. అధికారులకు ఆదేశం
- మునిసిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
- పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా.. వేస్ట్ మేనేజ్మెంట్.. టౌన్ ప్లానింగ్.. టిడ్కో ప్రాజెక్ట్ లపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునిసిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్ట్ లపై చర్చించారు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి.. చెత్త తొలగించని కారణంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిందని.. దీన్ని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలని సీఎం సూచించారు. వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ పక్కాగా జరగాలని.. ఆ మార్పు రాష్ట్రంలో ప్రతి చోటా కనిపించాలని సీఎం అధికారులకు తెలిపారు. వచ్చే గాంధీ జయంతి నాటికి సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మనేజ్మెంట్ గాడిలో పడాలని ఆదేశించారు.
Chandrababu: చనిపోతే ఒక్క క్షణం.. జైల్లో అనుమానాస్పద ఘటనలు.. చంద్రబాబు సంచలనం
Also Read
- Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఇప్పటికే వెలుగు చూసిన ఘటనపై మరింత సమాచారం సేకరించడంతో పాటు.. ఇతర కార్పొరేషన్లలో జరిగిన అక్రమాలను సైతం బయటకు తీయాలని ఆదేశించారు. అర్బన్ లోకల్ బాడీలలో మొత్తం 50 లక్షల గృహాలు ఉండగా.. ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్లకు నీటి కుళాయి సౌకర్యం ఉందని.. మరో 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే అమృత్ పథకం ద్వారా మరో 7.5 లక్షల ఇళ్లకు కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు.
Chennai: గ్యాస్ లీకేజ్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత..
తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా టిడ్కో ఇళ్ల ప్రాజెక్టు స్థితిగతులపైనా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేసేందుకు అవసరమై నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్దంగా ఉందని.. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామని సీఎం అన్నారు. పట్టణ ప్రాంతంలో ఇంకా ఇళ్ల నిర్మాణం ఏ మేర చేపట్టాలి.. లబ్దిదారులు ఎందరు ఉంటారు అనే విషయంలో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్ వంటి విభాగాల్లో డ్రోన్లను సమర్థవంతంగా ఉపయోగించుకుని ఫలితాలు రాబట్టాలని సీఎం సూచించారు. పీపీపీ పద్దతిలో పార్కులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం సూచించారు.
తాజావార్తలు
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!