CM Chandrababu: పాలనలో మార్పు, మార్క్ చూపిస్తున్న చంద్రబాబు.. ఈ రోజు సీఎస్, డీజీపీలతో కీలక భేటీ
- పాలనలో తన మార్క్.. మార్పు చూపిస్తున్నారు సీఎం చంద్రబాబు
- ఇవాళ సీఎంవో.. సీఎస్.. డీజీపీతో ప్రత్యేకంగా సమావేశం
- సమర్థులైన అధికారులకు.. నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇచ్చేందుకు కసరత్తు
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టనున్నారు ప్రభుత్వ పెద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్నారు.. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ చూపిచేందుకు రెడీ అయ్యారు.. ఇవాళ సీఎంవో, సీఎస్, డీజీపీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుండగా.. అదే సమయంలో.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టనున్నారు ప్రభుత్వ పెద్దలు. ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.. ఇక, ఐదు హామీల అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి.. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.. తాను ప్రకటించినట్టుగానే.. టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి.. కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు.. ఇక, అన్ని విభాగాల్లోనూ ఈ తరహా మార్పులు, చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
Read Also: Gold Price Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై రూ.660 పెరిగింది!
Also Read
- RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!