Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Focus On Logistics To Cut Costs And Strengthen Infrastructure In Ap

CM Chandrababu: లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.. వ్యయం తగ్గించడమే లక్ష్యం!

Published Date :September 26, 2025 , 5:41 pm
By Sampath Kumar
  • రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం
  • భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లు
  • జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతం
  • లాజిస్టిక్స్‌కు అయ్యే వ్యయం తగ్గించడమే లక్ష్యం
CM Chandrababu: లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.. వ్యయం తగ్గించడమే లక్ష్యం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే.. ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లు అని, జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41 శాతం మేర వాటా కలిగి ఉందన్నారు. లాజిస్టిక్స్‌కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే.. ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై సీఎం అసెంబ్లీలో మాట్లాడారు.

‘వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలి. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లుగా ఉంది. జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉంది. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41 శాతం మేర వాటా కలిగి ఉంది. లాజిస్టిక్స్‌కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. ఇది ఉత్పత్తి దారులకు, వినియోగదారులకూ అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. వస్తు రవాణా తూర్పు కోస్తా తీరంలో ఉన్న ఏపీ ఓ కీలకమైన ప్రాంతం. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఎకో సిస్టంలో రైలు, రోడ్డు, జల రవాణాతో పాటు పైప్ లైన్ మార్గం కూడా కీలకంగా మారింది. పైప్ లైన్ ద్వారా గ్యాస్, నీరు, స్లర్రీ లాంటివి రవాణా చేసేందుక ఆస్కారం ఉంది. మల్టీమోడల్ ట్రాన్స్ పోర్టు సిస్టం ద్వారా హైయ్యర్ కార్గో రవాణా చేస్తే వ్యయం తక్కువ అవుతుంది. ప్రస్తుతం డ్రై పోర్టుల ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. లాజిస్టిక్స్ ఎకో సిస్టంలో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీని కోసం ఓ బ్లూ ప్రింట్ తయారు చేసి వ్యయం తగ్గించటమే లక్ష్యంగా పనిచేస్తాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

Also Read: Jogi Ramesh: చిరంజీవిని తిడితే.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు!

‘మలేషియాలో ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్‌లో 8 వరుసల రోడ్లు వేశారు. అప్పట్లో వాజ్‌పేయీతో మాట్లాడి నెల్లూరు-చెన్నై హైవేను తెచ్చాం. దేశానికి మణిహారంగా గోల్డెన్‌ క్వాడ్రిలేటరల్‌ ప్రాజెక్టు మారింది. స్థానిక భూములు, ట్రాఫిక్‌ పరిస్థితులు చూసి రోడ్లు వేస్తాం. హైవేల విషయంలో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. హైవేల్లో రూ.లక్షన్నర కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. రైల్వే డబుల్‌ లైన్లను నాలుగు వరుసలుగా మార్చే అవకాశం ఉంది. రైల్వేలో హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్లపై చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై మధ్య హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్లు కాబోతున్నాయి. మన రాష్ట్రంలో రైల్వేలో 145 రకాల పనులు జరుగుతున్నాయి. మేం వచ్చిన వెంటనే విశాఖ రైల్వే జోన్‌ ప్రారంభించాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Assembly 2025
  • AP infrastructure
  • Chandrababu Assembly Speech
  • Chandrababu logistics plan
  • cm chandrababu

తాజావార్తలు

  • Priyanka Chopra : 1300 గంటలు కష్టపడి చేసిన నెక్లెస్.. ప్రియాంక మెడలో ఎలా ఉందో చూశారా?

  • Trump-Kharg Island: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను.. తాజా మాస్టర్ ప్లాన్ ఇదే!

  • Gautam Gambhir: నేను మనిషినే.. నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు.. విరాట్‌, రోహిత్‌ వివాదంపై గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Free Urea: తెలంగాణ రైతులకు అదిరే శుభవార్త.. ఉచితంగా యూరియా పంపిణీ..!

  • Harish Rao : అసెంబ్లీ వారం రోజులు కూడా నడవదు

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions