Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cid Files Charge Sheet Against Chandrababu In Amaravati Assigned Lands Case

Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. చార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ

Published Date :March 11, 2024 , 8:21 pm
By Sudhakar Ravula
Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. చార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది సీఐడీ.. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పలు కీలక అంశాలను పేర్కొంది.. ఈ కేసులో రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ అభియోగాలు మోపింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. వారితో పాటు ఈ కేసులో తుళ్ళూరు అప్పటి తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ సంస్థ ఎండీ అంజనీ కుమార్ కూడా నిందితులుగా ఉన్నారు.. అమరావతిలో 1100 ఏకరాలకు సంబంధించి రూ.4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు అంచనా వేసింది సీఐడీ.. చంద్రబాబు, నారాయణ బినామీలతో రాజధాని ఏరియాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోకుండా.. కొనుగోలు చేసినట్టు సీఐడీ గుర్తించింది.. 2014కు ముందు.. ఆ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ పరిశీలిస్తే 942 ఏకరల్లో 1330 మంది వ్యక్తులు CRDAలో LPS ద్వారా లబ్ది పొందినట్టు చార్జీ షీట్ లో పేర్కొంది సీఐడీ.. కొమ్మరెడ్డి బ్రహ్మానందరెడ్డి అనే రియల్టర్ ను అప్రూవర్ గా స్టేట్ మెంట్ నమోదు చేసినట్టు కోర్టుకు తెలిపింది సీఐడీ..

Read Also: Kate Middleton: బ్రిటన్‌ యువరాణి ఫొటో విడుదల.. అయినా అనుమానాలే?

Also Read

  • AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
  • Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన
  • Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్‌గా మారతారా? మరో షాకింగ్‌ సర్వే!
  • Iran: ఇరాన్‌లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి

కాగా, మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో 2020లో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 420 (మోసం), 409 (నేరపూరితమైన విశ్వాస ఉల్లంఘన), 506 (నేరపూరిత బెదిరింపు), 166 & 167 (ప్రజా సేవకుడు చట్టాన్ని ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేయబడింది. 217 (ప్రజా సేవకుడు తప్పుగా నమోదు చేయడం), 109 (ప్రేరేపణ)తోపాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన వివిధ సెక్షన్లు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల చట్టం, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం, మరియు అవినీతి నిరోధక చట్టం కింది కేసులు మోపారు.. సీఐడీ లెక్కల ప్రకారం 1,100 ఎకరాల భూమి విలువ రూ.4,400 కోట్లు. రాజధాని నగరంలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీల నుంచి అసైన్డ్ భూములను లాక్కోవాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఇతర మంత్రులు, వారి ‘బినామీలు’ కబ్జా చేశారని సీఐడీ పేర్కొంది.. ల్యాండ్ పూలింగ్ పథకం కింద అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందన్న ధీమాతో వారికి ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారని అభియోగాలు మోపింది.. అనంతరం అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు జీవో జారీ చేయాలని మంత్రులు అప్పటి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amaravati capital
  • Andhra Pradesh
  • AP CID
  • assigned lands scam
  • Chandrababu Naidu

తాజావార్తలు

  • Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్‌లలో రీపోలింగ్ ప్రారంభం

  • Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!

  • AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

  • RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్‌తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)

  • Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions