Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anakapalli Chitty Scam Cunning Lady Cheats 300 People Of Four Crores In Anakapalli

Chitty Scam: చిట్టిలపేరుతో 300 మందికి టోకరా.. 4 కోట్ల రూపాయలతో ఉడాయించిన కన్నింగ్ లేడి..!

Published Date :June 30, 2025 , 10:12 pm
By Kothuru Ram Kumar
Chitty Scam: చిట్టిలపేరుతో 300 మందికి టోకరా.. 4 కోట్ల రూపాయలతో ఉడాయించిన కన్నింగ్ లేడి..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Chitty Scam: 300 మంది కష్టార్జితం.. సుమారు 4 కోట్ల రూపాయలు.. చిట్టీల రూపంలో గల్లంతైపోయాయి. భారీ మోసాన్ని తట్టుకోలేక బాధితులు కుదేలయ్యారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్యే శరణ్యంగా భావించి ఆందోళన చేపట్టారు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.

వారంతా పేద మధ్య తరగతి కుటుంబాలుకు చెందినవారు. చిన్న చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో నెల నెలా కట్టుకొని అవసరాలకు వాడుకునే వారు. పిల్లల చదువులకు, ఇళ్ళ నిర్మాణాలకు, పెళ్ళిళ్ళు చేయటానికి ఉపయోగ పడతాయని నమ్మకంగా ఒకరి దగ్గర ఏళ్ల తరబడి చీటీలు కడుతున్నారు. చివరకి వారి నమ్మకాన్ని వమ్ము చేసి ఏకంగా రూ. 4 కోట్లతో పరారయ్యారు. దీంతో లబోదిబో మంటున్నారు బాధితులు.

Also Read

  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
Add as a preferred
source on google

Read Also:Nalgonda: బావా మరదళ్లకు వివాహేతర బంధం అంటగట్టారు.. బాధ భరించలేక ఇద్దరూ సూసైడ్..

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు చౌడువాడలో చిట్టీ పేరుతో వందలాది మందిని ఓ మహిళ మోసం చేసింది. బాధితులంతా న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. చౌడువాడ శివారు గరుగుబిల్లికి చెందిన పెదిరెడ్ల పద్మజ అలియాస్ చల్లపల్లి పద్మకు సామర్లకోటకు చెందిన శ్రీనుతో వివాహమైంది. వీరికి కుమారుడు సాయి ఉన్నాడు. 15 ఏళ్ల కిందట చౌడువాడకు వచ్చి స్థిరపడ్డారు. భర్త చనిపోవడంతో కొన్నాళ్లపాటు అనకాపల్లిలో ఉన్నారు. అక్కడ ఉంటూనే చౌడువాడ గ్రామస్థులతో పరిచయాలు పెంచుకుని పప్పుల చీటీలు, వరలక్ష్మి వ్రతం పేరుతో బంగారు కాసుల చీటీలను ప్రారంభించారు. అనంతరం రూ. లక్ష నుంచి రూ.20 లక్షల వరకు చిట్టీలు వేశారు.

నమ్మకం కలిగిన వారంతా.. చిట్టీలు పాడిన మొత్తాన్ని వడ్డీకి ఆమెకే ఇచ్చేవారు. ఇలా రూ. 4 కోట్లు వసూలు చేసి వారం రోజుల కిందట ఆరోగ్యం బాగోలేదని కుమారుడితో ఇంటి నుంచి వెళ్లిన పద్మజ తిరిగి రాలేదు. వారు వెళ్లిన రెండో రోజుల వరకు ఫోను పని చేసింది. ఆ తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో గ్రామ పెద్దలకు తెలిపి బాధితులు అంతా కలిసి కె.కోటపాడు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నమ్మకంగా ఉంటూనే ఇలా బోర్డు తిప్పేయడంతో బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ప్రాధేయ పడుతున్నారు.

Read Also:Ponguleti Srinivasa Reddy: పదేళ్లు పరిపాలించిన పెద్దలు లక్షల కోట్లు అవినీతి చేశారు.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

కాళ్లు అరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా నిందితులను పట్టుకోకుండా తమ గోడు పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆందోళన చెందారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. మోసం చేసిన నిర్వాహకరాలను పట్టుకుని తమకు అప్పగించాలని.. పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. చౌడవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇందులో కొంతమంది ఒంటిపై కిరోసన్ పోసుకొని చనిపోతామంటూ బెదిరించారు. ఇప్పటివరకు సుమారు 300 కుటుంబాలకు పైగా మోసానికి గురైనట్టు తెలిపారు. తిరిగి డబ్బులు చేతికి అందకపోతే ఆర్థికంగా చితికి పోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని తెలిపారు పోలీసులు. కానీ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anakapalli Fraud
  • Chit Fund Fraud
  • Chitty Fund Scam
  • Choudawada News
  • Crime News

తాజావార్తలు

  • Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!

  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions