Ponguleti Srinivasa Reddy: పదేళ్లు పరిపాలించిన పెద్దలు లక్షల కోట్లు అవినీతి చేశారు.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా నడుస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల పాలన, కలల సాధనకు ప్రభుత్వం కట్టుబడిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా పేదవాడి కళలను సహకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి భారీగా అప్పు ఉన్న.. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్నామన్నారు. గత పది సంవత్సరాలలో BRS ప్రభుత్వం విద్యను నిర్వర్ణ్యం చేశారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో విద్యకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు.
Read Also: Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా
Also Read
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
- Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు.. మన రాష్ట్రంలో ఇస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు. ఎన్నికల ఉన్నప్పుడే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చారు, ఇప్పుడు ఉన్న ఇందిరమ్మ రాజ్యం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా, రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు వేశాం. ధరణిని బంగాళాఖాతంలో కలిపి రైతుల కోసం భూభారతి చట్టం తీసుకువచ్చి రైతులకు మేలు చేశామన్నారు.
Read Also:Captain Cool: ‘కెప్టెన్ కూల్’ ట్యాగ్లైన్కు ధోనీ ట్రేడ్మార్క్ దరఖాస్తు..!
మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చాం.. 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు, కాలేశ్వరం పేరుతో లక్షల కోట్లు అవినీతి చేశారు. BRS పార్టీ వాళ్లకు పదవి లేకపోయి సరికి పేద ప్రజలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖమ్మం జిల్లా నుండి BRS పార్టీ వారు అసెంబ్లీ గేటు తాకనీయను అని వాగ్దానం చేశాను.. ఒక్కరు గేటు తాకలేదని అన్నారు.
తాజావార్తలు
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
-
Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
-
Neeraj Chopra: లుసానే డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రాకు రజతం.. 88.05 మీటర్ల సీజన్ బెస్ట్
-
Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: ‘కాకా’ టైటిల్ గ్లింప్స్తో పూనకాలు!
-
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?