Nalgonda: బావా మరదళ్లకు వివాహేతర బంధం అంటగట్టారు.. బాధ భరించలేక ఇద్దరూ సూసైడ్..
- ఇద్దరూ వరుసకు బావా మరదళ్లు
- ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు
- వివాహేతర బంధం ఉందన్న కారణంతో వేధింపులు
- కేతేపల్లి పోలీస్ స్టేషన్లో సుష్మితపై కేసు నమోదు
- బావ రంజిత్కు వీడియో కాల్ చేసిన సుధాకర్
- ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ వరుసకు బావా మరదళ్లు. అయినంత మాత్రాన వివాహేతర బంధం అంటగట్టారు. అంతే కాదు.. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్న తమ భాగస్వాముల నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కున్నారు. చిత్ర హింసలు అనుభవించారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది కలిసే ఆత్మహత్య చేసుకున్నారు. బంధుత్వం, ప్రేమ, సమాజపు ఒత్తిళ్లు.. ఈ మూడింటి మధ్య ఊగిసలాడుతూ, ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్లో కలకలం రేపింది..
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
ఇక్కడ చూడండి.. ఈ వ్యక్తి పేరు బంధబాల సుధాకర్.. ఈ మహిళ పేరు పాసాల సుష్మిత. ఇద్దరూ వరుసకు బావా మరదళ్లు అవుతారు. కానీ ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఇద్దరి జీవితాల్లో తమ భాగస్వాముల నుంచి ఈసడింపులు.. వివాహేతర బంధం ఉందన్న కారణంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఇద్దరూ మనస్తాపం చెందారు.. ఇటీవల వారు సన్నిహితంగా ఉండటం వల్ల వివాహేతర బంధం కొనసాగుతుందన్న ఆరోపణలతో ఇరు కుటుంబాల మధ్య తగాదాలు చెలరేగాయి. ఈ కారణంగా సుష్మిత భర్త ధనరాజ్ ఆమెపై నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సుధాకర్, సుష్మిత రెండు రోజుల క్రితం బీబీనగర్ మండలంలోని కొండమడుగు శివారులో రాగల రిసార్ట్లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు…
READ MORE: Banakacherla Project: ఏపీకి షాకిచ్చిన కేంద్రం..! బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి ..
ఆదివారం మధ్యాహ్నం సమయంలో సుధాకర్ తన బావ రంజిత్కు వీడియో కాల్ చేసి, ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపాడు. అయితే, తమ స్థానం మాత్రం వెల్లడించలేదు. దీంతో రంజిత్ తనకు సమీపంలో ఉన్న ఉప్పల్ పోలీసుల సహకారంతో బీబీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అటు సుష్మిత కూడా తన ఆత్మహత్యకు గల కారణాలు వివరిస్తూ సెల్ఫీ వీడియో చేశారు. అందులో తన బాధలను వివరించారు. ఆ వీడియోను భర్త ధనరాజ్కు పంపించారామె. అంతే కాదు వీరిద్దరూ వేర్వేరుగా సూసైడ్ లెటర్స్ రాశారు.. మరోవైపు సుష్మిత భర్త ధనరాజు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు కనుక్కొని సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వారిద్దరు పురుగుల మందు తాగి మృతి చెంది ఉండడంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహేతర బంధం ఉందన్న కారణంతో ఇదర్నీ అవమానించారు. దీంతో ఆ బాధను తట్టుకోలేక ఇద్దరూ ఆత్మార్పణ చేసుకున్నారు..
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!