Karnataka: తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు.. తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
- తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు
- తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
- కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘటన
- నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు. చల్లకెరె తహసీల్దార్ కార్యాలయంలో లోపల వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అది గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు.
Gurugram: గురుగ్రామ్ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన ఖరీదైన భవనాలు
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
అనంతరం.. నిందితుడు పృథ్వీరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడం.. అధికారిక విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)కి వినతిపత్రం సమర్పించారు.
Jaggery Ganapati: గాజువాకలో 70 అడుగుల గణపతి.. 18 టన్నుల బెల్లంతో..
అయితే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పృథ్వీరాజ్.. జులైలో విహారయాత్రకు వెళ్లి కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో.. తన కొడుకు తన వద్దకు చేరుకోకపోవడంతో తల్లి చల్లకెరె పోలీస్ స్టేషన్లో జూలై 2న ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే.. పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకునేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. నిందితుడు పృథ్వీరాజ్, జులై 23న పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో.. అతడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో.. తహసీల్దార్ సమక్షంలో మరోసారి ఇలా చేయబోమని నిందితుడు చెప్పాడు. అనంతరం.. ఆవేశంతో తన తల్లి ఫిర్యాదును పట్టించుకోని చల్లకెరె పోలీసులపై డిఆర్డిఓ, విధానసౌధ సహా ప్రభుత్వ భవనాలను పేల్చివేస్తానని నిందితుడు సోషల్ మీడియాలో బెదిరించాడు. ఈ క్రమంలో.. నిందితుడి తల్లి ఫిర్యాదును నమోదు చేయని చల్లకెరె స్టేషన్లోని ఏఎస్ఐని అధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా.. తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని వాహనానికి నిప్పు పెట్టాడు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!