Karnataka: తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు.. తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
- తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు
- తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
- కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘటన
- నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు. చల్లకెరె తహసీల్దార్ కార్యాలయంలో లోపల వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అది గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు.
Gurugram: గురుగ్రామ్ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన ఖరీదైన భవనాలు
Also Read
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
అనంతరం.. నిందితుడు పృథ్వీరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడం.. అధికారిక విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)కి వినతిపత్రం సమర్పించారు.
Jaggery Ganapati: గాజువాకలో 70 అడుగుల గణపతి.. 18 టన్నుల బెల్లంతో..
అయితే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పృథ్వీరాజ్.. జులైలో విహారయాత్రకు వెళ్లి కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో.. తన కొడుకు తన వద్దకు చేరుకోకపోవడంతో తల్లి చల్లకెరె పోలీస్ స్టేషన్లో జూలై 2న ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే.. పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకునేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. నిందితుడు పృథ్వీరాజ్, జులై 23న పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో.. అతడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో.. తహసీల్దార్ సమక్షంలో మరోసారి ఇలా చేయబోమని నిందితుడు చెప్పాడు. అనంతరం.. ఆవేశంతో తన తల్లి ఫిర్యాదును పట్టించుకోని చల్లకెరె పోలీసులపై డిఆర్డిఓ, విధానసౌధ సహా ప్రభుత్వ భవనాలను పేల్చివేస్తానని నిందితుడు సోషల్ మీడియాలో బెదిరించాడు. ఈ క్రమంలో.. నిందితుడి తల్లి ఫిర్యాదును నమోదు చేయని చల్లకెరె స్టేషన్లోని ఏఎస్ఐని అధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా.. తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని వాహనానికి నిప్పు పెట్టాడు.
తాజావార్తలు
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!