Karnataka: తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు.. తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
- తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు
- తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
- కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘటన
- నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తింపు.
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు. చల్లకెరె తహసీల్దార్ కార్యాలయంలో లోపల వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అది గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు.
Gurugram: గురుగ్రామ్ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన ఖరీదైన భవనాలు
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
అనంతరం.. నిందితుడు పృథ్వీరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడం.. అధికారిక విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)కి వినతిపత్రం సమర్పించారు.
Jaggery Ganapati: గాజువాకలో 70 అడుగుల గణపతి.. 18 టన్నుల బెల్లంతో..
అయితే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పృథ్వీరాజ్.. జులైలో విహారయాత్రకు వెళ్లి కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో.. తన కొడుకు తన వద్దకు చేరుకోకపోవడంతో తల్లి చల్లకెరె పోలీస్ స్టేషన్లో జూలై 2న ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే.. పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకునేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. నిందితుడు పృథ్వీరాజ్, జులై 23న పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో.. అతడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో.. తహసీల్దార్ సమక్షంలో మరోసారి ఇలా చేయబోమని నిందితుడు చెప్పాడు. అనంతరం.. ఆవేశంతో తన తల్లి ఫిర్యాదును పట్టించుకోని చల్లకెరె పోలీసులపై డిఆర్డిఓ, విధానసౌధ సహా ప్రభుత్వ భవనాలను పేల్చివేస్తానని నిందితుడు సోషల్ మీడియాలో బెదిరించాడు. ఈ క్రమంలో.. నిందితుడి తల్లి ఫిర్యాదును నమోదు చేయని చల్లకెరె స్టేషన్లోని ఏఎస్ఐని అధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా.. తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని వాహనానికి నిప్పు పెట్టాడు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!