TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 15 ఏళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 వరకే అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల నడకమార్గాలలో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఇవాళ కూడా అలిపిరి నడకమార్గంలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. దీంతో వారిని గుర్తించి తిరిగి కుటుంభసభ్యులుకు అప్పగించారు భధ్రతాసిబ్బంది. మరోవైపు నడకమార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో టీడీడీక కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల భధ్రత దృష్టా రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే చిన్నారులను నడకమార్గంలో అనుమతించనుంది టీటీడీ. మధ్యాహ్నం 2 గంటల తరువాత 15 సంవత్సరాలు లోబడిన చిన్నారులకు నడకమార్గంలో అనుమతి నిరాకరించింది.
Health News: అరటి పండు పరగడుపున తినొచ్చా?
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టి తిరిగి సాధరణ పరిస్థితులు నెలకొన్న తరువాతే చిన్నారులుకు పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై తిరుమలకు వెళ్లే దారిలో చిరుత దాడికి పాల్పడింది. రెండు రోజుల క్రితం చిరుత దాడిలో అక్షిత అనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనల నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు అలిపిరి మార్గంలో వెళ్లే పిల్లలకు ట్యాగ్ లను ఏర్పాటు చేస్తుంది టీటీడీ. తిరుమల నడక మార్గంలో ఏడో మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తుల బృందాలను అనుమతించనున్నారు. భక్తుల ముందు, వెనుక రోప్ పార్టీలను టీటీడీ నియమించింది. ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
Ankita Lokhande: తండ్రి పాడె మోసిన నటి.. వీడియో వైరల్
మరోవైపు నిన్నటి రోజు కూడా నడకమార్గం, ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో చిరుతల సంచారిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలలో, గాలిగోపురం నుంచి 7వ మైలు వద్ద ప్రాంతంలో చిరుత సంచారిస్తుంది. రెండవ ఘాట్ రోడ్డు 38వ మలుపు వద్ద చిరుత తిరుగుతున్నట్లు గుర్తించారు. అయితే భవిష్యత్త్ లో ఎలాంటి ఘటనలు జరగకుండ ఉండేందుకు టీటీడీ అప్రమత్తమైంది.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!