CM Revanth Reddy: “మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంపై దృష్టి”
- మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం సర్వే
- ప్రజలను ఆదుకోవడం ఎలా అనే దానిపై దృష్టి
- కాంగ్రెస్ విజన్ వేరు
- రాజకీయాలు చేయొద్దు
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసి పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానం.. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు చూడండని చెప్పరు. కాంగ్రెస్ ఇరిగేషన్.. ఎడ్యూకేషన్ మీదనే ఫోకస్ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ విజన్ తోనే దేశం ముందడుగు వేసిందని.. సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కంప్యూటర్ వద్దన్న వాళ్ళు ఉన్నారన్నారు. కానీ కంప్యూటర్ తో ఉద్యోగాలు పెరిగాయని.. ఆదాయం పెరిగిందని వెల్లడించారు. రాజీవ్ గాంధీ నూతన శకం ప్రారంభించారని కొనియాడారు. సిలింగ్ యాక్ట్ నీ కూడా దొరలు.. భూస్వాములు వ్యతిరేకించారని.. ఎప్పుడు ఎవరో ఒకరు వ్యతిరేకిస్తునే ఉంటరన్నారు. అధికారం కోల్పోయిన వాళ్ళు కొందరు ఇలా ప్రతిదీ అడ్డుకోవాలని చూస్తున్నారని.. అధికారులు.. మంత్రుల ముసుగులో దోచుకున్న బంది పోటు దొంగలు వాళ్ళు అని తీవ్రంగా విమర్శించారు. అలాంటి బందీ పోటు దొంగలు మూసిని అడ్డుకుంటున్నారని.. అద్దాల మెడల కోసం.. అందాల భామల కోసం మేము చేయడం లేదని మండిపడ్డారు.
READ MORE: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
Also Read
- Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
యూట్యూబ్ లతో అధికారం వస్తుందని అనుకుంటున్నారు.. మూసి లో ఉన్న మురికి కంటే ఎక్కువ.. వాళ్ల మెదడు అంత విషం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దుబాయ్ వెళ్లి.. సుందరీకరణ పేరుతో గుండు మీద జుట్టు పెంచుకొనే పాలసీ కాదని.. పోలీసులతో గుర్రాలతో తొక్కించినట్టు చేయమన్నారు. కొండపోచమ్మ , రంగనాయక సాగర్ , మల్లన్న సాగర్, కిష్టాపూర్ కి నేను సెక్యూరిటీ లేకుండా వస్తా.. మీరు వస్తారా అని బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ సవాల్ విసిరారు. “రచ్చ బండ నిర్వహిద్దాం.. కేసీఆర్.. నీ నియోజక వర్గానికే వస్తా. రచ్చ బండ దగ్గర కూర్చొని మాట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు ఇచ్చిన బాధ్యత కాబట్టి ప్రజలకు మేలు చేయాలన్న దే మా ఆలోచన. మూసి సుందరీకరణ కాదు. ప్రక్షాళన. దుబాయ్ వెళ్లి జుట్టు మొలిపించుకునే టట్టు కాదు. నది ప్రవహించే నగరం దేశం లోనే లేదు. అలాంటి నగరం హైదరాబాద్ మాత్రమే. దాన్ని పాలకుల నిర్లక్షం వల్ల మురికి కూపం అయ్యింది. మూసి పునరుజ్జీవం పోస్తాం. సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కరిని తరలించాలని మా ఆలోచన” అని సీఎం రేవంత్ అన్నారు.
READ MORE: Rana Daggubati: రానా సమర్పించు.. బాలీవుడ్లోకి సూపర్ హిట్ రీమేక్!!
ఆరు నెల్ల నుంచి అధికారులు సర్వే చేస్తున్నారని.. వేములఘాట్.. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలో ఎవరికైనా ఇండ్లు.. ఇంటి తాళం ఇచ్చారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. “మిడ్ మనేరు ను పిల్లను ఇచ్చిన పాపానికి ఊరినే ముంచారు. హైడ్రా ఏదైనా బూతమా.. ఫార్మ్ హౌస్ లో ఉన్న దొరనా. వచ్చి కబలించుకు పోవడానికి.. బఫర్ జోన్ లో 10 వేల ఇండ్లు ఉన్నాయి. వారిని ఎలా ఆదుకోవాలి.. బెటర్ లైఫ్ ఎలా ఇవ్వాలి అని ఎంఎల్ఏ లతో మాట్లాడండి అని మంత్రులకు చెప్పాం. బుల్డోజర్ లు మామీద నుంచి పోనియ్యాలి అని పోటీ పడుతున్నారు. నగరాన్ని సర్వ నాశనం చేయదలుచుకున్నారా?
వర్షం వస్తె చెన్నై.. బెంగుళూరు ఏమైందో చూశారా..? దుబాయ్ ఏమైంది. వయనాడ్ లో పరిస్థితి ఏమైందో తెలియదా? ఖమ్మం.. విజయవాడ మునిగి పోయింది. కండ్ల ముందు చూశాం. మూసి వల్ల మాకు ఆర్థిక ప్రయోజనం ఏమైనా ఉందా మాకు..? ఉప్పెన వచ్చిందంటే.. కొట్టుకు పోతాం. నాకు అనుకున్నవి అన్ని వచ్చాయి. నాకేమైనా వస్తుందా.. మీరంతా చెప్పండి.. వద్దు అంటే వదిలేద్దాం. టెండర్ క్యాన్సల్ చేసి పంపుతాం. నల్గొండ వాళ్ళ బాధలు పట్టవా. నల్గొండ వాళ్లంతా అడుగుతున్నారు. అడగడం అన్న.. మానేయండి. నల్గొండ ప్రజలు మౌనగా ఉంటే ఎలా. నన్ను బ్లేమ్ చేసేది ఓ దోపిడీ దొంగ. వాడు నన్ను తిడితే బాధ పడను. లక్ష 50 కోట్లు అంటున్నాడు. ఇదేమైనా కాళేశ్వర మా?” అని ప్రతిపక్షాలను సీఎం ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!