Ranjith Reddy: కాంగ్రెస్ బస్ ఫ్రీ ఇస్తే.. బీజేపీ వస్తే బాధలు ఫ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లిలో బుధవారం నాడు నిర్వహించిన రోడ్ షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంతో సంక్షేమం గ్యారెంటీ అని చెప్పగా.. బీజేపీ వస్తే సంక్షోభం గ్యారెంటీ అని ఆయన తెలిపారు. అయితే, సీఎం రేవంత్కు అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులను ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒక్కసారి జైలుకు పంపినందుకే రేవంత్.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని.. మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తీసుకెళ్తే.. ఇంకెంత స్థాయికి వెళతారో చూడాలన్నారు. తమకు గతంలో అండగా ఉన్నానని, ఇప్పుడు గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీకు మరిన్ని సేవలందిస్తానని రంజిత్ రెడ్డి తెలిపారు.
Read Also: Bandi Sanjay: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇక, గతంలో ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టారని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకే రాలేదని విమర్శించారు. శానిటైజర్ పూసుకుని ఇంట్లో పడుకున్నారని చెప్పారు. ఆయన ఏ ఒక్కరికీ అపాయింట్మెంట్ ఇవ్వరని చెప్పుకొచ్చారు. తాను మీకు తలలో నాలుకలా ఉంటానని… కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటానన్నారు. అందుకే ఈ చేవెళ్ళ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఇక, తమ చేవెళ్ళ కోసం ఇన్ని గంటల సమయం ఇస్తున్న రేవంత్ అన్నకు థ్యాంక్స్ చెప్పారు. తమ కోసం ఇన్ని గంటల పాటు ఓపిగ్గా ఎదురు చూసిన అక్కలకు, అన్నలకు అందరికీ రంజిత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఇదే ఓపికతో ఈనెల 13వ తేదీన కచ్చితంగా హస్తం గుర్తుకే ఓటేసి, తనను గెలిపించాలన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!