Nadendla Manohar: రెండ్రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
- తూనికలు కొలతలు విభాగపు అధికారులతో మంత్రి సమీక్ష
- తూనికలు కొలతలు విభాగంలోని పెండింగ్స్
- పౌరసరఫరాల అంశాలపై ఆరా
- రాష్ట్రంలో 253 మండల లెవల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండ్రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్యాలయంలో తూనికలు కొలతలు విభాగపు అధికారులతో సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ నాదెండ్ల సమీక్షించారు. తూనికలు కొలతలు విభాగంలోని పెండింగ్స్, పౌరసరఫరాల అంశంలో ఇప్పటికి ఉన్న పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించాను. రెండు రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లో తనిఖీ చేశా. కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడా కనిపించింది. ప్యాకెట్ల తూకంలో 5౦ నుంచి 80గ్రాములు తక్కువగా కనిపించింది. రాష్ట్రంలో 253 మండల లెవల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి రిపోర్టు ఇవ్వాలని అప్పుడే ఆదేశించా. ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ కేంద్రాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. 24 చోట్ల అక్రమాలు తేలాయి. బాధ్యులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తున్నాం. సరకులు సరఫరా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించా.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Vishwak Sen: శవాల మీద పేలాలు.. చెంబుతో బయలుదేరుతున్నారు.. రివ్యూయర్స్ పై విశ్వక్ ఫైర్
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
అక్రమాలు చేసిన వారు, దీని వెనుక ఉన్న వారెవరినీ వదిలిపెట్టమని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అక్రమార్కులు అందరిపైనా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే సరుకుల్లో దోపిడీ చేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా మార్పును కోరారు.. ఆ మేరకు మార్పు తప్పక ఉంటుందన్నారు. మేము నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తామని.. ఎవరైనా ప్రజల ఇబ్బంది పెట్టినా.. మోసం చేసినా సహించేదిలేదన్నారు. ధాన్యం అమ్ముకునే రైతులకు అన్యాయం జరగదు పారదర్శకంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!