Pawan Kalyan: తన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పవన్..పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై ఆరా
- క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్కి పోలీసులు గౌరవ వందనం
- పవన్ కు సాదర స్వాగతం పలికిన పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్
- ఆఫీసులో అధికారు లతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఈనెల 19న పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముంద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించారు.
READ MORE: Rahul Gandhi: రాహల్ గాంధీకి ఖర్గే బెదిరింపులు.. ఎందుకో తెలుసా..?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
అనంతరం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. తొలిసారి తన ఛాంబరుకు వచ్చిన పవన్ కల్యాణ్ని సీటులోంటి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు..ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం ఛాంబర్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి.. మీరు ఆ గుర్తుకు హూందాతనం తెచ్చారని పవన్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. తాజా రాజకీయాలు, అసెంబ్లీ సమావేశాలుపై చంద్రబాబు-పవన్ మధ్య చర్చ జరిగింది. చంద్రబాబు పోలవరం పర్యటన, ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై చర్చ జరిపారు. సచివాలయం చేరుకున్న అనంతరం నేరుగా సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!