Champions Trophy 2025: హమ్మయ్య.. పాకిస్థాన్కు రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
- ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం
- ఫిబ్రవరి 16న లాహోర్లో ఆరంభోత్సవ కార్యక్రమం
- కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు మ్యాచ్లతో బిజీగా ఉన్న కారణంగా కెప్టెన్ల ఫొటోషూట్ నిర్వహించడం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అన్ని జట్లకు తీరిక లేని షెడ్యూల్ ఉంది. భారత్తో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఆడనుంది. శ్రీలంకలో పర్యటనలో ఆస్ట్రేలియా ఉంది. టోర్నీకి ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ పాక్ చేరుకుంటాయి. సమయం లేకపోవడంతో కెప్టెన్ల ఫొటోషూట్, విలేకర్ల సమావేశం నిర్వహించడం లేదు’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ల ఫొటోషూట్ లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎనమిది టీమ్స్ తలపడనున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగబోతోంది. టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్ Aలో భారత్ సహా పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో, మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ దుబాయ్ వేదికగా తలపడనుంది. చివరిసారిగా 2013లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!