Eatala Rajendar: ముసలికన్నీరు కార్చే కాంగ్రెస్కి చెంపపెట్టులా దేశంలో కులగణన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eatala Rajendar: కేంద్రం చేపట్టబోతున్న కులగణనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ప్రకటన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గౌరవాన్ని కలిగించడమే కాకుండా.. చరిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. ఈటల మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ బీసీల జనగణన చేపట్టలేదని, అణగారిన వర్గాలకు ఛాంపియన్లా నటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లను మాత్రమే కొల్లగొట్టారని కాంగ్రెస్ ను విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోకుండా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కంటతడి పారిస్తుండటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ 2014లో ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. అలాగే 2021లో ఆదివాసి వర్గానికి చెందిన బిడ్డను రాష్ట్రపతిగా నియమించింది. ఇది బీజేపీ అణగారిన వర్గాల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనం అని అన్నారు.
Read Also: Revanth Reddy: కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం!
Also Read
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
ఈ సందర్బంగా ఈటల రాజేందర్ కేంద్ర మంత్రివర్గంలో సామాజిక న్యాయం ఎలా ప్రతిబింబించిందో వివరించారు. 27 మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 5 మంది మైనారిటీలు ఇలా మొత్తం 60 శాతం మంది అణగారిన వర్గాలకు చెందిన వారే మంత్రివర్గంలో ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కులగణన జరగడం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదే అని విమర్శించారు. ఇది ఓబీసీలకు గుర్తింపు కలిగించే చర్యగా అభివర్ణించారు. రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ వర్గాలకు మరింత ప్రాధాన్యం కలుగుతుందని తెలిపారు.
Read Also: Bandi Sanjay Kumar: జాతీయ కాంగ్రెస్ కులగణన వ్యతిరేకి.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!
కేంద్రం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ, బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు నిజమైన అండగా నిలుస్తోందని ఈటల రాజేందర్ స్పష్టంగా తెలిపారు. ఇది ఒక దృఢమైన రాజకీయ ప్రకటనగా మాత్రమే కాకుండా, సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలిచే చర్యగా విపక్షాలపై విమర్శలు చేస్తూ ఈటల అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!