BRS MPs meeting: కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిడితే.. ఊరుకోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో వరదలపై ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది అని ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. వరదసాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చింది.. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది.. తెలంగాణలో ఈ సారి అత్యధిక వర్షపాతం నమోదైంది అని వారు పేర్కొన్నారు.
Read Also: Rainfall In India: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు
Also Read
- Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా ఎంపీ కే. కేశవరావు మాట్లాడుతూ.. దేశం మొత్తం తెలంగాణను బేష్ అంటున్నారు.. కానీ, కొందరు అనరాని మాటలు మాట్లాడుతున్నారు.. కొన్ని గ్రామాల్లో 25 ఏళ్లుగా పడని వర్షాలు పడ్డాయి.. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం పనిచేసింది.. కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది.. వరద నష్టం అంచనా వేస్తున్నారు.. ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.. ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొంటుంది అని ఎంపీ కే.కేశవరావు అన్నారు.
Read Also: Rinku Singh: టీమిండియాలో స్థానం సంపాదించిన రింకూ.. కల నిజమైందని భావోద్వేగం
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు.. ఇలా అసత్య ప్రచారం చేయడం పద్దతి కాదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు అవగాహనా ఉందా.. కేసీఆర్ ను రైతు హంతకుడు అని అనడానికి నోరు ఎలా వచ్చింది.. కేసీఆర్ సీఎం అయ్యాక ఎడారిలా వున్న తెలంగాణా ను అభివృద్ధి చేశారు అని ఆయన అన్నారు. రైతు బంధు ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇవ్వలేదు.. నోరు ఉందని అడ్డగోలుగా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్నారు.. వారికి రైతులు బుద్ది చెప్పాలి అని నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు.. కాంగ్రెస్ ఎంపీలు కేసీఆర్ పై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని నామా డిమాండ్ చేశారు.
Read Also: Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆనందంలో డార్లింగ్ ఫ్యాన్స్.. ?
పార్లమెంట్ లో వరధలపై చర్చ జరపాలని కోరామని నామా నాగేశ్వరరావు తెలిపారు. వరదలు వచ్చినా ప్రజలను కాపాడుకున్నాం.. బాఆర్ఎస్ ప్రజలతోనే ఉంది.. మున్నేరు వాగు సమస్య ఉందని గతంలో ఎన్నో సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలకు చెప్పాం.. కేసీఆర్ శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు.. మాటలు చెప్పడం కాదు.. పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల గురించి ఒక్క సారైన నోరు విప్పారా.. దేశ ప్రజలను కాపాడు కావడానికే బీఆర్ఎస్ పార్టీ పెట్టామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాము.. మాతో కలిసి రండి పార్లమెంట్ లో తెలంగాణ గురించి మాట్లాడుదాం.. చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్ లో తెలంగాణ గురించి ప్రశ్నించండి.. రైతు హంతకుడు అనే మాటను వెనక్కి తీసుకోవాలన్నారు.
Read Also: Road Accident : 2 బస్సులు ఢీ..30 మందికి తీవ్రగాయాలు..
తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు చూసి కాంగ్రెస్ నేతలు బయపడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు నరరూప హంతకులు.. కాంగ్రెస్ ఉంటే ప్రజలు మేలు కంటే నష్టం ఎక్కువ.. మీ నాయకులు విహార యాత్రలకు, హానీ మూన్ లకు వెళ్తారు.. మా నేత రైతుల కోసం, ప్రజల కోసం మహారాష్ట్ర వెళ్లారు అని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!