Boora Narsaiah Goud : రాహుల్ గాంధీని చూస్తుంటే జెలెన్స్కీ గుర్తొస్తున్నారు
- రాహుల్ గాంధీని జెలెన్స్కీతో పోల్చిన బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్
- తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కోసం బీజేపీ డిమాండ్
- కులగణన, ఆర్థిక వివరాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్పై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boora Narsaiah Goud : కాంగ్రెస్ నాయకత్వంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని చూస్తుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తొస్తున్నారు అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ జెలెన్స్కీ లాంటివారిగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రోజుకో తీపి కబురుతో కాలయాపన చేస్తోంది అని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించిన ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)ను కుదించడం ద్వారా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు.
Plane Crash: విషాద గాధ.. ప్రారంభంలోనే ముగిసిన ఎయిర్ హోస్టెస్ కెరీర్..
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
ప్రభుత్వానికి ప్రత్యేకంగా సచివాలయం ఎందుకు కావాలి? గాంధీభవన్ నుంచే పాలన కొనసాగించండి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు నర్సయ్య గౌడ్. సచివాలయం కాంగ్రెస్ పార్టీదేమీ కాదు… అది ప్రజలదే అని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసిన నర్సయ్య గౌడ్, “సొల్లు కబుర్లు చెప్పకుండా బీసీలకు న్యాయం చేయాలి” అని అన్నారు. తెలంగాణలో జరిగిన కుల గణనను కూడా పూర్తిగా బయటపెట్టాలని కోరారు.
“కుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను విభజించడానికే ఉపయోగించింది” అని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని బూర నర్సయ్య డిమాండ్ చేశారు. “ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన డబ్బు ఎంత..? ఖర్చు పెట్టింది ఎంత..? ప్రజలకు ఇచ్చింది ఎంత..? అన్నదీ స్పష్టంగా బహిర్గతం చేయాలి” అని అన్నారు. రాహుల్ గాంధీకి ఎవరు ఎక్కువ డబ్బు సంచులు పంపిస్తారో అని పోటీ పడుతోంది పార్టీ. కానీ ప్రజల ప్రయోజనాలపై మాత్రం కాంగ్రెస్కు దృష్టి లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!