Boora Narsaiah Goud : రాహుల్ గాంధీని చూస్తుంటే జెలెన్స్కీ గుర్తొస్తున్నారు
- రాహుల్ గాంధీని జెలెన్స్కీతో పోల్చిన బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్
- తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కోసం బీజేపీ డిమాండ్
- కులగణన, ఆర్థిక వివరాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్పై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boora Narsaiah Goud : కాంగ్రెస్ నాయకత్వంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని చూస్తుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తొస్తున్నారు అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ జెలెన్స్కీ లాంటివారిగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రోజుకో తీపి కబురుతో కాలయాపన చేస్తోంది అని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించిన ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)ను కుదించడం ద్వారా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు.
Plane Crash: విషాద గాధ.. ప్రారంభంలోనే ముగిసిన ఎయిర్ హోస్టెస్ కెరీర్..
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
ప్రభుత్వానికి ప్రత్యేకంగా సచివాలయం ఎందుకు కావాలి? గాంధీభవన్ నుంచే పాలన కొనసాగించండి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు నర్సయ్య గౌడ్. సచివాలయం కాంగ్రెస్ పార్టీదేమీ కాదు… అది ప్రజలదే అని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసిన నర్సయ్య గౌడ్, “సొల్లు కబుర్లు చెప్పకుండా బీసీలకు న్యాయం చేయాలి” అని అన్నారు. తెలంగాణలో జరిగిన కుల గణనను కూడా పూర్తిగా బయటపెట్టాలని కోరారు.
“కుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను విభజించడానికే ఉపయోగించింది” అని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని బూర నర్సయ్య డిమాండ్ చేశారు. “ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన డబ్బు ఎంత..? ఖర్చు పెట్టింది ఎంత..? ప్రజలకు ఇచ్చింది ఎంత..? అన్నదీ స్పష్టంగా బహిర్గతం చేయాలి” అని అన్నారు. రాహుల్ గాంధీకి ఎవరు ఎక్కువ డబ్బు సంచులు పంపిస్తారో అని పోటీ పడుతోంది పార్టీ. కానీ ప్రజల ప్రయోజనాలపై మాత్రం కాంగ్రెస్కు దృష్టి లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”
తాజావార్తలు
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!