Boney Kapoor: “అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదు”.. బాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు
- సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన
- తాజాగా ఈ ఘటనపై స్పందించిన బాలీవుడ్ నిర్మాత
- ఇందులో అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదన్న బోనీకపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై యుగంధర్ గౌడ్ అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఆయన ఢిల్లీలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.
READ MORE: AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. 14 అంశాల ఎజెండాలకు ఆమోదం! ప్రధాని పర్యటనపై చర్చ
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
తాజాగా ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ స్పందించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జనాలు ఎక్కువమంది రావడం వల్లే ఆ ఘటన జరిగిందన్నారు. ఇందులో అల్లు అర్జున్ను తప్పేం లేదని.. నిందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో ప్రేక్షకులకు యాక్టర్లకు ఎక్కువగా అభిమానిస్తారు. అజిత్ నటించిన ఓ సినిమాను చూసేందుకు థియోటర్ వద్దకు అర్ధరాత్రి వెళ్లాను. అక్కడ దాదాపు 20వేల మంది పోగయ్యారు. థియోటర్ వద్ద నేను అంత మందిని చూడటం అదే మొదటి సారి. పూర్తి సినిమా చూసి బయటకు వచ్చే సరికి సమయం నాలుగు అయ్యింది. అయినా.. థియోటర్ బయట చాలా మది అభిమానులు అలాగే ఎదురు చూస్తూ నిలబడ్డారు. రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోలు అభిమానులు ఎక్కువగా ఉంటారు. వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు.. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఎక్కువ మంది జనాలు రావడంతో ఆ ఘటన(సంధ్య థియోటర్ తొక్కిసలాట) జరిగింది. ఇందులో అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదు’’ అని బోనీకపూర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
READ MORE: Keerthi Suresh : 15ఏళ్ల పాటు అతడి ప్రేమలో మునిగిపోయిన కీర్తి సురేష్.. చివరికి ?
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!