MP K. Laxman : దక్షిణాది పేరు మీద ప్రజలను స్టాలిన్ రెచ్చగొడుతున్నారు
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే
- దక్షిణాది పేరు మీద ప్రజలను రెచ్చగొడుతున్న స్టాలిన్
- పోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి చర్యలు లేవు : ఎంపీ లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP K. Laxman : తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు వేర్వేరు పార్టీలు అన్న ప్రచారం ప్రజలను మోసగించేందుకు మాత్రమేనని, వాస్తవానికి ఈ రెండు పార్టీలకు నడివీధిలో సంబంధం ఉన్నట్టే కాంగ్రెసే భవిష్యత్గా ఎదిగేందుకు బీఆర్ఎస్ తో చేతులు కలిపిందని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే నెపంతో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రాంతీయతకు ప్రాధాన్యత ఇస్తూ స్టాలిన్ కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
తెలంగాణకు కేంద్రం భారీ నిధులు కేటాయిస్తోందని, గతంలో ఎప్పుడూ రైల్వే ప్రాజెక్టులపై ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి జరగలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. పేద రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం కొందరికి అసహనాన్ని కలిగిస్తోందని, ఆ అసహనమే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ల భయాన్ని బయటపెడుతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ వేగంగా ఎదుగుతోందని, దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుమ్మక్కవుతున్నాయని లక్ష్మణ్ అన్నారు. ఈ రెండు పార్టీలను ప్రజలు గుర్తించి తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి, వాటి నుండి దృష్టి మరల్చేందుకు హైదరాబాద్లో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నోసార్లు స్పష్టంగా ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే డిలిమిటేషన్ అంశాన్ని తప్పుడు ప్రచారానికి ఉపయోగిస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనడానికి ఇండియా కూటమి ఒకే ఒక మార్గంగా ఈ పార్టీలు భావిస్తున్నాయని, తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఒక్కోసారి ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు.
Virat Kohli: విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు.. టీ20 కెరీర్లో అరుదైన ఘనత..
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!