MP K. Laxman : దక్షిణాది పేరు మీద ప్రజలను స్టాలిన్ రెచ్చగొడుతున్నారు
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే
- దక్షిణాది పేరు మీద ప్రజలను రెచ్చగొడుతున్న స్టాలిన్
- పోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి చర్యలు లేవు : ఎంపీ లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP K. Laxman : తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు వేర్వేరు పార్టీలు అన్న ప్రచారం ప్రజలను మోసగించేందుకు మాత్రమేనని, వాస్తవానికి ఈ రెండు పార్టీలకు నడివీధిలో సంబంధం ఉన్నట్టే కాంగ్రెసే భవిష్యత్గా ఎదిగేందుకు బీఆర్ఎస్ తో చేతులు కలిపిందని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే నెపంతో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రాంతీయతకు ప్రాధాన్యత ఇస్తూ స్టాలిన్ కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
తెలంగాణకు కేంద్రం భారీ నిధులు కేటాయిస్తోందని, గతంలో ఎప్పుడూ రైల్వే ప్రాజెక్టులపై ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి జరగలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. పేద రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం కొందరికి అసహనాన్ని కలిగిస్తోందని, ఆ అసహనమే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ల భయాన్ని బయటపెడుతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ వేగంగా ఎదుగుతోందని, దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుమ్మక్కవుతున్నాయని లక్ష్మణ్ అన్నారు. ఈ రెండు పార్టీలను ప్రజలు గుర్తించి తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి, వాటి నుండి దృష్టి మరల్చేందుకు హైదరాబాద్లో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నోసార్లు స్పష్టంగా ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే డిలిమిటేషన్ అంశాన్ని తప్పుడు ప్రచారానికి ఉపయోగిస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనడానికి ఇండియా కూటమి ఒకే ఒక మార్గంగా ఈ పార్టీలు భావిస్తున్నాయని, తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఒక్కోసారి ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు.
Virat Kohli: విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు.. టీ20 కెరీర్లో అరుదైన ఘనత..
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..