Daggubati Purandeswari: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక నిర్ణయం.. రేపటి నుంచి జోనల్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి.. ఇక, పనిలోకి దిగిపోయారు.. బాధ్యతలు స్వీకరించిన రోజే ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్పై విరుచుకుపడ్డా ఆమె.. మరోవైపు పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా రేపటి నుంచి బీజేపీ జోనల్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.. జోనల్ సమావేశాలకు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి హాజరుకానున్నారు.. పార్టీలో కొత్త కమిటీల రూపకల్పన ముందు జోనల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు పురంధేశ్వరి.. జోనల్ సమావేశాలు ముగిశాక కొత్త కమిటీలు ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి..
Read Also: Lahiru Thirimanne: రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్
Also Read
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ.. ఈ నెల 25వ తేదీన గుంటూరులో కోస్తాంధ్ర జోన్ సమావేశం జరగనుండగా.. 26వ తేదీన రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం నిర్వహించనున్నారు.. ఇక, 27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. కాగా, వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని పురంధేశ్వరి ధ్వజమెత్తిన విషయం విదితమే.. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులు.. కార్పొరేషన్లకు కేటాయించడం లేదన్న ఆమె.. పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులకు వడ్డీలు కట్టడంతోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని.. అప్పులు చేసి సంపద సృష్టించే ఒక్క నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శలు గుప్పించిన విషయం విదితమే. మరోవైపు.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు పురంధేశ్వరి.. సరైన సమయంలో సరైన నిర్ణయం బీజేపీ పెద్దలు తీసుకుంటారని చెప్పారు. ‘‘జనసేన మా మిత్రపక్షం.. పవన్ కల్యాణ్తో ఫోన్లో మాట్లాడా.. త్వరలో అవకాశం బట్టి కూర్చుని మాట్లాడుకుంటాం అని ఏపీ బీజేపీ చీఫ్ వెల్లడించిన విషయం విదితమే.

తాజావార్తలు
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!