MP GVL Narasimha Rao: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు..! ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్లో మరోసారి టీడీపీ-జనసే-బీజేపీ కలసి పనిచేసే దశగా చర్చలు సాగుతున్నాయి.. ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తులో ఉండగా.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు చిగురించింది.. ఇక, మూడు ఒకేతాటిపైకి రావడమే మిగిలిఉంది.. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చలు జరిపివచ్చారు. ఇక, పొత్తులపై చర్చలు జరుగుతున్నట్టు ఓ దశలో అమిత్షా కూడా ప్రకటించారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ జట్టు కట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి పొత్తుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అని స్పష్టం చేశారు.
Read Also: Kamareddy: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన.. సర్కార్ సీరియస్..!
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఇక, విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు జీవీఎల్.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘాంగా సేవలు అందించిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న రావడం చాలా గొప్ప విషయం అన్నారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. కానీ, బీజేపీకి కాంగ్రెస్ పార్టీలా వ్యత్యాసం లేదు.. దేశానికి వ్యక్తులు అందించిన సేవలతోనే సంబంధం అని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీవీ నరసింహరావు జయంతి రోజు సెలవుగా ప్రకటించాలి, మెమోరియల్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయబడింది.. అని చాలా సార్లు చెప్పాను అని గుర్తుచేశారు.. మరోవైపు.. తమ ఉనికి కాపాడుకోవడం కోసం వైఎస్ షర్మిల వంటివాళ్లు టీవీల్లో కనిపించడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.
తాజావార్తలు
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి