Sabarimala Pilgrims: అయ్యప్ప భక్తుల సమస్యలపై.. రాజ్యసభలో తెలుగులో మాట్లాడిన ఎంపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Dr K Laxman Spoke on Sabarimala Ayyappa Devotees on Rajya Sabha: శబరిమల అయ్యప్ప భక్తుల కష్టాలపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడారు. ప్రతి ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శనానికి కేరళ వెళుతుంటారని.. అక్కడి ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించకుండా ఉదాసీనత చూపిస్తోందన్నారు. 20 గంటలుగా క్యూలైన్లలో భక్తులు ఇబ్బందిపడుతున్నా, తొక్కిసలాట జరుగుతున్నా.. కేరళ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.
జీరో అవర్లో అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలపై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ తెలుగులో మాట్లాడారు. ‘ప్రతియేటా అయ్యప్ప భక్తులు మాలవేసి, దీక్ష చేపట్టి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు కేరళకు వెళ్తున్నారు. కేరళ ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించకుండా ఉదాసీనత చూపుతోంది. దాంతో భక్తులు పడుతున్న అగచాట్లు వర్ణనాతీతం. 20 గంటలుగా క్యూలైన్లలో భక్తులు ఇబ్బందిపడుతున్నా, తొక్కిసలాట జరుగుతున్నా.. కేరళ ప్రభుత్వానికి పట్టడం లేదు. అయ్యప్ప భక్తుల పట్ల కేరళ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. నిష్ఠతో దీక్ష చేసే భక్తులపై లాఠీఛార్జి చేయిస్తోంది. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు’ అని అన్నారు.
Also Read
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
Also Read: Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవలకు అంతరాయం.. టైమ్లైన్లు ఖాళీ!
‘తమిళనాడుకు చెందిన 12 ఏళ్ల అమ్మాయి పద్మశ్రీ, 15 ఏళ్ల రాజేశ్ పిళ్లై చనిపోయారు. నీటి కొరత, అధ్వాన్నమైన పారిశుధ్యం, ఆహార కొరతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన రవాణా వసతులు కూడా కేరళ ప్రభుత్వం కల్పించడం లేదు. 2011 జనవరి 14న మకరజ్యోతి దర్శనం సమయంలో తొక్కిసలాట జరిగి 106 మంది చనిపోయారు. కేరళ హైకోర్టు చెప్పినా, పార్లమెంటులో ప్రస్తావించినా హిందూ వ్యతిరేక నిరంకుశ కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేరళ ప్రభుత్వం భక్తుల పట్ల వివక్ష, హిందూ దేవాలయాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూసిన వాళ్లే అంతమయ్యారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను మోహరించి భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతున్నా’ అని ఎంపీ కోరారు.
తాజావార్తలు
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!