Dr Parthasarathi: రాయలసీమ గర్జన రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ గర్జన పేరుతో రాయలసీమ పై మరోసారి మోసానికి తెగబడుతోందని మండిపడ్డారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అన్నారు. వైసీపీ రాయలసీమను అభివృద్ధి చేయలేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రాయలసీమ గర్జన పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కొత్త నాటకానికి తెర లేపడం సిగ్గుచేటన్నారు. అన్యాయానికి గురైన వాళ్ళు నిరసన తెలుపుతూ సభలు పెడతారు..! నేడు ” రాయలసీమకు అన్యాయం చేసినవాళ్లే సభలు పెట్టి నిరసన తెలపడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలిపింది మొదటగా బీజేపీయే అన్నారు. వైస్సార్సీపీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు చెబుతూ మోసం చేస్తోంది. మీకు చిత్తశుద్ధి ఉంటే – హైకోర్టు కర్నూల్లో పెడతామని ఇంతవరకు ‘ కేంద్రానికి, సుప్రీంకోర్టుకు, మంత్రిత్వ శాఖకు కు గత 3 సంవత్సరాలలో ఎందుకు ప్రతిపాదనలు పంపలేదు. గత వారంలో సుప్రీంకోర్టు లో ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్ హైకోర్టు అమరావతిలోనే ఉండాలన్నది ప్రభుత్వ కోరిక’ అని చెప్పింది నిజం కాదా? అన్నారు. మీకు రాయలసీమ న్యాయ రాజధాని ఏర్పాటు పై చిత్తశుద్ధి ఉంటే కర్నూలు లో ఏర్పాటు కావలసిన జ్యుడీషియల్ అకాడమీని మంగళగిరికి ఎందుకు తరలించారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
కర్నూలులో ఏర్పాటు కావలసిన కృష్ణా రివర్ బోర్డుని విశాఖకు ఎందుకు తరలించారో సమాధానం చెప్పాలి..?వైస్సార్సీపీ ప్రభుత్వం RDMP ( రాయలసీమ దుర్భిక్ష నివారణ కమిషన్ ) పేరుతో రాయలసీమలోని 23 ప్రాజెక్టులను రూ.33,862 కోట్లతో అభివృద్ధి చేస్తామని గతంలో ప్రకటించారుగా ఏమైంది ? గత 3 సంవత్సరాలలో RDMP కోసం నిధులు కేటాయించకుండా సీమ ప్రజలను మరోసారి మోసం చేయలేదా.? మీరు ఇచ్చిన హామీ మేరకు RDMP కి నిధులు మంజూరు చేయకపోవడం కారణంగా వ్యవసాయ పనులు లేక , రైతు కూలీలు వలసలు పోతున్నారు అలాంటి వారి ఉపాధి కోసం మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.?
Read Also: Gujarat Elections: ప్రధాని మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు.. రోడ్ షోపై రచ్చ
గతంలో జగన్ గారు ప్రజల సమక్షంలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం … కేసీ కేనాల్ ఆధునికీకరణ .. హంద్రీనీవా కాలువ విస్తరణ …సిద్దేశ్వరం ..అలుగు మరియు వేదావతి .. వంటి ప్రాజెక్టు లను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదో సీమ ప్రజలకు సమాధానం చెప్పాలి..?? ఈ డిసెంబర్ 23 కి జగన్ గారు కడప ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అవుతోంది. !! మరి ఇంతవరకు ఎందుకు మొదలవలేదు ?ఎప్పుడు పూర్తి చేస్తారు ? ఇక్కడి బిడ్డలకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా..? రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటు ,అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనుకబడేలా చేసిన మీరే నేడు రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్పి డ్రామాలు ఆడడం ఎంతవరకు సమంజసం.? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, యుద్ధ ప్రతిపాదికన రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డా.పార్థసారథి డిమాండ్ చేశారు.
Read Also: Zomato: డెలివరీ చేసింది చాలు. ఇక.. ‘‘ఇంటికి వెళ్లండి’’
తాజావార్తలు
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Spider Man: భారత్లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!