Gujarat Elections: ప్రధాని మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు.. రోడ్ షోపై రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress objects to Modi’s ‘roadshow’, questions ECI’s silence: గుజరాత్ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఈనెల 8న గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్లోని రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారని.. నేను దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాని.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అభినందిస్తున్నాని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Read Also: COVID-19: కోవిడ్ “మానవ నిర్మిత వైరస్”.. సంచలన విషయాన్ని వెల్లడించిన సైంటిస్ట్
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఓటు వేసిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు రోడ్ షో చేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మోదీ రోడ్ షో పై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సైలెంట్ గా ఉంటుందని ప్రశ్నించింది. రెండో దశ పోలింగ్ సమయంలో బీజేపీ ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ, అమిత్ షాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పోలింగ్ రోజు ప్రధాని మోదీ ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రెండున్నర గంటల పాటు రోడ్ షో చేశారని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని.. ఎన్నికల సంఘం ఒత్తడికి గురవుతున్నట్లు కనిపిస్తోందని పవన్ ఖేరా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున గిరిజన నాయకుడు కాంతి ఖరాడి రక్షణ కోరుతూ ఈసీకి లేఖ రాశారు. అయినా ఈసీ స్పందించలేదు.. ఆ తరువాత అతనిపై బీజేపీ గుండాలు దాడి చేశారని అన్నారు. గుజ్ ప్రాంతంలో మద్యం నిషేధం ఉన్నప్పటికీ బీజేపీ మద్యం పంపిణీ చేసిందని ఆరోపించారు. ఈ రోడ్ షోపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజు ఎన్నికల ప్రచారాన్ని ఈసీ నిషేధించింది. అయితే వారిద్దరికి మాత్రం మినహాయింపులు ఉండవచ్చు అని ప్రధాని మోదీ, అమిత్ షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు దీదీ.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!