10th Exam Paper Leak: కేటీఆర్పై కేసులు పెట్టడం ఏంటి.. లీకేజీకి కారకులెవ్వరు?: ఆర్ఎస్ ప్రవీణ్
- రాజకీయ దుమారం రేపుతోన్న పేపర్ లీకేజీ ఘటన
- కేటీఆర్పై కేసులు ఎందుకు పెట్టారు
- విద్యావ్యవస్థ చాలా ఘోరంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ జిల్లా నకిరేకల్లో పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్ పోలీస్స్టేసన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్పై నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత, శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్పై నకిరేకల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బాద్యత వహించాల్సింది పోయి కేటీఆర్ మీదు కేసులు పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు.
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ‘నల్గోండ జిల్లా నకిరేకల్లో తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. రెండవ అంతస్తులోని పేపర్ ఫోటోలు తీసుకోని వెల్తుంటే వ్యవస్థ ఏం చేసింది. పోలీసులు ఉన్నారా?, విద్యాశాఖ అధికారులున్నారా?, నిఘా వ్యవస్థ ఎక్కడికి పోయింది. విద్యావ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బాద్యత వహించాల్సింది పోయి కేటీఆర్పై కేసులు పెట్టడం ఏంటి?. లీకేజీకి కారకులెవ్వరు?. అక్కడున్న వారికి లీకేజీ వ్యవహారం ఎక్కడ పెద్దగా అవుతుందో అని ఇది డైవర్షన్’ అని అన్నారు.
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
‘గోడదూకి పోయి ఆవిద్యార్థిని భయపెట్టించి పరీక్ష పత్రాన్ని ఫోటో తీసుకోని పోయారు. విద్యార్థిని ఎందుకు డిబార్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక.. మోసం చేయడం, పక్కదోవ పట్టించడం పనిగా పెట్టుకున్నాడు. ఆరు మంది పేపర్ లీకేజీ కోసం పనిచేసారు. వారి కులాలు కేటీఆర్కు ఎలా తెలుస్తది. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రజల మీద, ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన సాగిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీరు పెట్టిన కేసుల ఎఫ్ఐఆర్ను కోర్టులు కొట్టేస్తున్నాయి. పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్ చదుతున్నారా?.. లేక రేవంత్ రెడ్డి గాంధీ భవన్ నుంచి చెప్పగానే కేసులు పెడుతున్నారా?. ఇంతకీ పోలీసు వ్యవస్థ ఉందా?. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం చెప్పాలి’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!