Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హేటిరో సంస్థకు ఇచ్చిన భూమి పై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు లేవు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని ఆమోదిస్తున్నట్లు అర్థమవుతుంది.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం బాధాకరమన్నారు. సీఎస్ కు అన్ని ఆధారాలతో లేఖ ఇస్తున్నాం.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ 37ను ఉపసంహరించుకుని.. ఆ భూమిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి అని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డికి రైతాంగం మీద ప్రేమ పుట్టుకొచ్చింది.. డిసెంబర్ 9 పోయింది ఇప్పడు ఆగష్టు 15లోపు రుణమాఫీ అని కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు 80వేల కోట్లు అవసరం అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు.. రాహుల్ గాంధీతో చెప్పి పాకిస్థాన్ బడ్జెట్ కూడా తెచ్చుకోండి.. ఎన్నికల్లో బాలకృష్ణ మాదిరిగా రేవంత్ రెడ్డి డైలాగ్స్ కొడుతున్నారు అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
Read Also: Chhattisgarh Encounter: కంకేర్లో పోలీసులు-నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్.. 18 మంది మావోలు హతం..!
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలి అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆగష్టు 15వ తేదీలోపు రైతు, బీసీ డిక్లరేషన్లు అమలు చేస్తావా.. లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. మేనిఫెస్టోపై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన ఉందా అనే అనుమానం కలుగుతుంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఐదు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు.. బీజేపీని గెలిపించేందుకు 5 చోట్ల బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను పెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను పెడితే.. కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలహీనమైన వాళ్లేనా?.. డిక్లరేషన్లు అమలు చేసే వరకు బీజేపీ వెంటాడుతుంది.. రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!