Godavari Anjireddy: గోదావరి అంజిరెడ్డికి పటాన్చెరు బీజేపీ టికెట్..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Anjireddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు తెలంగాణ బీజేపీ నేతల కసరత్తు తుది దశకు చేరుకుంది.. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన రాష్ట్ర నేతలు.. లిస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.. తొలి విడతలో 50 నుంచి 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. అయితే, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ను బీజేపీ అధిష్టానం గోదావరి అంజిరెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు నేతలు.
గత కొన్ని సంవత్సరాలుగా పటాన్ చెరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా గోదావరి అంజి రెడ్డి ఉత్సాహంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులతో కలిసి పాల్గొనడం అందరికీ తెలిసిందే. సభలు, పార్టీ ముఖ్య కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆ చోటుకు ఒకరోజు ముందే చేరుకొని క్యాడర్ మొత్తాన్ని చూసుకుంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, డీ కే అరుణ, బండి సంజయ్ తో సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా కేంద్ర పెద్దలు ఎవరు రాష్ట్రానికి వచ్చిన కూడా ఇంటికి ఆహ్వానించి ఘనంగా ఆతిథ్యం ఇస్తూ వస్తున్నారు. అంతే కాదు పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర పెద్దలలో సలహాలు, సూచనలు తీసుకునే వారు.
Also Read
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
మరోవైపు.. పార్టీకి సంబంధం లేకుండా సొంత నిధులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గోదావరి అంజిరెడ్డి.. ఇటీవల ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక స్కూల్ కి 50 లక్షలు విరాళం అందించి, అత్యాధునిక టెక్నాలజీ తో అభివృద్ధి చేశారు. ఒక ఆటో డ్రైవర్ మరణించగా అతని కుటుంబానికి 20 లక్షల రూపాయల చెక్ అందచేశారు. గ్రామ గ్రామాన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్ షెల్టర్స్ నిర్మించి, బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా మినరల్ వాటర్ ట్యాంకులు చేయించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే విధంగా తమకు చేతనైనంత పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ పట్ల చూపిస్తున్న విధేయతకు, నియోజక వర్గ ప్రజల కోసం చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈసారి బీజేపీ అధిష్టానం గోదావరి అంజిరెడ్డికి పటాన్చెరు నియోజక వర్గ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!