KS. Eshwarappa: ప్రధాని చెప్పినా నా నిర్ణయం మారదు.. విజయం మాదే..
ఈసారి లోక్సభ ఎన్నికల్లో తన కొడుకే ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధిస్తారని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చి తన మనసు మార్చే ప్రయత్నం చేసినా ఫలితం ఉండదన్నారు. స్వతంత్రంగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా గత కొద్ది రోజుల క్రితం బీజేపీ మొత్తం 20 మంది అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేయగా.. అంతకంటే ముందే హవేరి- గడగ్ లోక్సభ సీటును తన కుమారుడు కే.ఈ.కాంతేష్ కు సీటు కావాలని బీజేపీ అదిష్టానంతో కేఎస్ ఈశ్వరప్ప చర్చలు జరిపారు.
Read Also: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?
Also Read
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
కానీ, కాంతేష్కు హవేరి లోక్సభ సీటు వస్తుందంటూ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సైతం హామీ ఇవ్వగా.. కాంతేష్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని కూడా యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లు ఈశ్వరప్ప వెల్లడించారు. అయితే, అనూహ్యంగా హవేరీ లోక్సభ నియోజకవర్గం నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని బీజేపీ అధిష్టానం పోటీలో దించుతుంది. దీంతో అధిష్టానం నిర్ణయంపై కేఎస్. ఈశ్వరప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Baby Girl Born: అమానుషం.. మూడోసారీ కూడా ఆడబిడ్డే పుట్టడంతో.. పాపని పొలాల్లో విసిరేసిన తల్లి..!
ఈ తరుణంలో శివ మొగ్గలో జరిగిన బహిరంగ సభలో ఈశ్వరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరప్ప మద్దతుదారులు స్వంతంత్ర్య అభ్యర్ధిగా బరిలో దిగడంపై మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఒప్పిస్తే పోటీ నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు.. దీనికి ఈశ్వరప్ప రియాక్ట్ అయ్యారు. ‘మోడీ నిర్ణయం ఎలా ఉన్నా వెనక్కి తగ్గేది లేదు.. నా మద్దతుదారులను, కార్యకర్తలను నేను ఎప్పుడు అగౌరవపరచనన్నారు. విజయవంతంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు ఉందన్నారు. ఇక, అంతకు ముందు ఓ సందర్భంలో.. ‘నేను 40 ఏళ్లుగా పార్టీకి నమ్మకంగా పని చేశా.. సీటీ రవి, సదానంద గౌడ, నళిన్కుమార్ కటీల్, ప్రతాప్ సింహాలు మద్దతుగా నిలిచారు. కానీ, లోక్సభ సీట్ల కేటాయింపులో తనకు అన్యాయమే జరిగిందని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం కేఈ ఈశ్వరప్ప ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో