Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న రాత్రి విచారణ అనంతరం అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ అంశాలకు సంబంధించిన దర్యాప్తునకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆయనకు భద్రతను ఇవ్వడానికి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత ఈడీ కేజ్రీవాల్ ను అరెస్టు జరిగింది. అయితే, ఈ కేసులో మార్చి 15వ తేదీన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్కు పాల్పడినట్లు కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే, ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను ఈడీ అరెస్టు చేయగా.. ఇప్పుడు ఈ కేసులో నాలుగో హై ప్రొఫైల్ అరెస్ట్ జరిగింది. PMLA సెక్షన్ 3, సెక్షన్ 4 కింద మనీలాండరింగ్ ఆరోపణలపై దాదాపు 18 నెలల్లోనే 16 మంది నాయకులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
Read Also: Mr Bachchan : మిస్టర్ బచ్చన్ కొత్త షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
అయితే, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మొదటి అరెస్టు 2022 సెప్టెంబర్ 28న సమీర్ మహేంద్రుడిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక, మహేంద్రు రెండు చెల్లింపులు చేసినట్లు ఈడీ ఆరోపణలు చేసింది. వీరిలో మొదటి చెల్లింపుగా 1 కోటి రూపాయలను అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు దినేష్ అరోరాకు ఇవ్వగా.. రెండో చెల్లింపుగా గురుగ్రామ్కు చెందిన మధ్యవర్తి అర్జున్కు రూ.2 నుంచి 4 కోట్లు ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనింది. అలాగే, విజయ్ నాయర్ ఆదేశాల మేరకు డబ్బును రికవరీ చేసినట్లు ఈడీ ఆరోపిస్తుంది.
Read Also: Crying Rooms: ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్లు.. వారి కోసం ప్రత్యేకం..!
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, అమిత్ అరోరాలను అరెస్టు చేశారు. ఈ అరెస్టులు 2022లో జరిగాయి. వీరితో పాటు 2023లో గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, రాఘవ్ మాగుంట, అమన్ ధాల్, అరుణ్ పిళ్లై, మనీష్ సిసోడియా, దినేష్ అరోరా, సంజయ్ సింగ్లను ఈడీ అరెస్ట్ చేసింది. ఇక, 2024లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Basil Joseph: అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!