Bandi Sanjay Kumar: ఒక గ్రామమే పథకాలకు ఎంపికా.. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం చీటింగ్ చేస్తోంది!
- మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదు
- ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే.. ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు పెట్టాలన్నారు. పేదల ఇళ్ల కోసం కాకుండా.. పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేనేలేదని, మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంటి? అని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదు. పేర్లు మార్చాలనుకుంటే మాత్రం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుంది. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ మేం అన్యాయం చేయబోం. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా?.. గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది?, ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు?. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీకి నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని సెటైర్లు వేశారు.
Also Read
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
‘రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేసింది. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. 6 గ్యారంటీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేనేలేదు. మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంటి?. మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేయలేదా?. రాష్ట్ర ప్రజలను ఇంత దుర్మార్గంగా చీటింగ్ చేస్తారా?. రాష్ట్ర ప్రజలందరికీ లబ్ది చేకూరుస్తామని చెప్పి.. మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం నీచం. కాంగ్రెస్ నేతల జేబుల నుండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? లేక పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి తెచ్చి ఖర్చు చేస్తున్నారా?. ప్రజలు కట్టిన పన్నులతోనే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు చేస్తోంది కదా?’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Also Read: Indiramma Atmiya Bharosa: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో పిల్!
‘గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే.. కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా?. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా?. పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలి. గద్దర్ కు ఎట్లా పద్మ అవార్డులిస్తాం. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా?. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్. తెలంగాణ సెంటిమెంట్తో ఎవరు లాభపడ్డారో.. ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్ధమైంది’ అని బండి సంజయ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!