Tiranga Yatra: భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టనున్న బీజేపీ.!
- దేశవ్యాప్తంగా 'తిరంగా యాత్ర'
- మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనున్న 'తిరంగా యాత్ర'.
- బీజేపీ పార్టీ నేతృత్వంలో పెద్దెత్తున ప్లాన్.
Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జాతీయ జెండా అయిన ‘తిరంగా’కి గౌరవాన్ని పెంచుతూ, ప్రజలలో దేశభక్తి భావాన్ని నాటడం లక్ష్యంగా బీజేపీ ఈ యాత్ర చేప్పట్టబోతుంది.
Read Also: Lokesh Kanagaraj : లోకేశ్ కనగరాజ్ నెక్ట్స్ సినిమాల పరిస్థితి ఏంటి.?
Also Read
- Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
- MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
ఈ యాత్రను జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా నేతృత్వంలో చేపడుతున్నారు. ఆయనతో పాటు సంబిత్ పత్రా, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ లాంటి కీలక నేతలు యాత్ర నిర్వహణలో భాగస్వాములు కానున్నారు. మే 11న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా తదితరులు యాత్ర కార్యాచరణపై సమగ్ర చర్చలు జరిపారు. యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, జాతీయ పతాకావందన కార్యక్రమాలు, ప్రజా సదస్సులు, ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రచారం చేసే అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలతో సైనికుల మధ్య మమకారాన్ని పెంచుతూ, దేశ భద్రతపై మోడీ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించడమే ఈ యాత్ర లక్ష్యం.
Read Also: Operation Sindoor: దేశభక్తిని చాటుకున్న పేరెంట్స్.. 17 మంది నవజాత బాలికలకు ‘సింధూర్’ అని నామకరణం
అయితే, ఈ యాత్రకు ఎటువంటి రాజకీయ కోణం లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇది దేశం కోసం పోరాడిన సైనికుల సాహసాన్ని గుర్తించి, ప్రజలను ఐక్యంగా తీర్చిదిద్దే ప్రణాళికగా తీసుకున్నారు. ఈ ఈ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా దేశభక్తి వాతావరణం నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణాలు, గ్రామాల్లో తిరంగా ఎగురవేస్తూ.. ప్రతి ఒక్కరిలో దేశానికి గౌరవం, సైనికుల పట్ల గౌరవాన్ని పెంచాలనేది యాత్ర ముఖ్య ఉద్దేశ్యం.
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో