Tiranga Yatra: భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టనున్న బీజేపీ.!
- దేశవ్యాప్తంగా 'తిరంగా యాత్ర'
- మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనున్న 'తిరంగా యాత్ర'.
- బీజేపీ పార్టీ నేతృత్వంలో పెద్దెత్తున ప్లాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జాతీయ జెండా అయిన ‘తిరంగా’కి గౌరవాన్ని పెంచుతూ, ప్రజలలో దేశభక్తి భావాన్ని నాటడం లక్ష్యంగా బీజేపీ ఈ యాత్ర చేప్పట్టబోతుంది.
Read Also: Lokesh Kanagaraj : లోకేశ్ కనగరాజ్ నెక్ట్స్ సినిమాల పరిస్థితి ఏంటి.?
Also Read
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఈ యాత్రను జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా నేతృత్వంలో చేపడుతున్నారు. ఆయనతో పాటు సంబిత్ పత్రా, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ లాంటి కీలక నేతలు యాత్ర నిర్వహణలో భాగస్వాములు కానున్నారు. మే 11న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా తదితరులు యాత్ర కార్యాచరణపై సమగ్ర చర్చలు జరిపారు. యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, జాతీయ పతాకావందన కార్యక్రమాలు, ప్రజా సదస్సులు, ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రచారం చేసే అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలతో సైనికుల మధ్య మమకారాన్ని పెంచుతూ, దేశ భద్రతపై మోడీ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించడమే ఈ యాత్ర లక్ష్యం.
Read Also: Operation Sindoor: దేశభక్తిని చాటుకున్న పేరెంట్స్.. 17 మంది నవజాత బాలికలకు ‘సింధూర్’ అని నామకరణం
అయితే, ఈ యాత్రకు ఎటువంటి రాజకీయ కోణం లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇది దేశం కోసం పోరాడిన సైనికుల సాహసాన్ని గుర్తించి, ప్రజలను ఐక్యంగా తీర్చిదిద్దే ప్రణాళికగా తీసుకున్నారు. ఈ ఈ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా దేశభక్తి వాతావరణం నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణాలు, గ్రామాల్లో తిరంగా ఎగురవేస్తూ.. ప్రతి ఒక్కరిలో దేశానికి గౌరవం, సైనికుల పట్ల గౌరవాన్ని పెంచాలనేది యాత్ర ముఖ్య ఉద్దేశ్యం.
తాజావార్తలు
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోనీ గుడ్బై!
-
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!