కోలీవుడ్లో టాప్ దర్శకుడు అంటే లోకేశ్ కనగరాజ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేకుండా అగ్ర దర్శకుల లిస్ట్ లో నంబర్ 1 కు వెళ్ళాడు లోకేష్. ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ అనే వరల్డ్ సృష్టించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో కూలీ లాంటి భారీ మల్టీ స్టారర్ చిత్రాలను తీసుకువస్తున్నాడు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇది కూడా లోకి యూనివర్స్ లో భాగంగానే వస్తోంది.
Also Read : NabhaNatesh : నల్లని చీరలో.. తెల్లని బంగారంలా మెరుస్తున్న నభా నటేష్..
కాగా ఇప్పుడు లోకేష్ దర్శకుడి నుండి హీరోగా మారుతున్నాడు. కెప్టెన్ మిల్లర్ ఫేం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు లోకేశ్. ధనుష్ ఇళయరాజా బయోపిక్ లేట్ కావడంతో లోకేశ్ ను పరిచయం చేయబోతున్నాడు అరుణ్. అయితే ఇప్పడు లోకేష్ సినిమాల పరిస్థితి ఏంటనే సందిగ్ధత నెలకొంది. కూలీ షూటింగ్ ముగిసింది. కార్తీతో ఖైదీ 2 చేయాల్సి ఉంది. అలాగే కమల్ హాసన్ తో విక్రమ్ 2 కు చేయాలి. సూర్యతో రోలెక్స్ ను కూడా రోల్ చేయాలి. కానీ ఇప్పుడు లోకేశ్ హీరోగా సినిమా అంటే ఎలా లేదన్న మూడు నుండి ఐదు నెలలు పోతుంది. మధ్యలో కూలీ ప్రమోషన్స్ కు మరో నెల అదనం. సో లోకేశ్ స్వీయ దర్శకత్వానికి చాలా గ్యాప్ వస్తుంది. సూర్య, కార్తీ, కమల్ సినిమాలు మొదలెట్టేందుకు చాలా టైమ్ వస్తుంది. అరుణ్ డైరెక్ట్ చేసే సినిమా సూపర్ హిట్ అయితే లోకేశ్ మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఈ విషయమైన రానున్న రోజుల్లో క్లారిటి వస్తుందేమో చూడాలి.