Bandi Sanjay: కేసీఆర్ తో కొట్లాడింది బీజేపీ.. ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు ఓటేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గానే జరిగిందిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోదాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమేళన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. “విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది కేసీఆర్. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడినది బీజేపీ పార్టీ.. కానీ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం కొట్లాడింది బీజేపీ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానం కోసమే ప్రయత్నం చేస్తుంది. 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్ని వర్గాల కోసం కొట్లాడింది బీజేపీ. మతపరమైన రిజర్వేషన్లకు మొదటి నుంచి బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. పక్కా మేము రాముడి వారసులం. ప్రజల తరఫున కొట్లాడటానికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీకి ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నాం.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Moto G04s: మోటో నుండి రాబోతున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. వివరాలు ఇలా..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
కాగా.. చౌటుప్పల్ మండలం కోయ్యలగూడెం వద్ద.. ఖమ్మం వెళ్తున్న బండి సంజయ్ కి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ చరిష్మా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఎన్నికల గెలుపులో దోహదం చేస్తుందని తెలిపారు. సర్వే సంస్థలు ఊహించని ఫలితాలను ఎన్నికల్లో చూస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని.. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!