Bandi Sanjay: కేసీఆర్ తో కొట్లాడింది బీజేపీ.. ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు ఓటేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గానే జరిగిందిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోదాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమేళన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. “విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది కేసీఆర్. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడినది బీజేపీ పార్టీ.. కానీ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం కొట్లాడింది బీజేపీ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానం కోసమే ప్రయత్నం చేస్తుంది. 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్ని వర్గాల కోసం కొట్లాడింది బీజేపీ. మతపరమైన రిజర్వేషన్లకు మొదటి నుంచి బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. పక్కా మేము రాముడి వారసులం. ప్రజల తరఫున కొట్లాడటానికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీకి ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నాం.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Moto G04s: మోటో నుండి రాబోతున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. వివరాలు ఇలా..
Also Read
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
కాగా.. చౌటుప్పల్ మండలం కోయ్యలగూడెం వద్ద.. ఖమ్మం వెళ్తున్న బండి సంజయ్ కి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ చరిష్మా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఎన్నికల గెలుపులో దోహదం చేస్తుందని తెలిపారు. సర్వే సంస్థలు ఊహించని ఫలితాలను ఎన్నికల్లో చూస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని.. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు.
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!