Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం, వైరల్ అవ్వాలనే పిచ్చి ఈ రోజుల్లో మనుషులతో ఏమేం చేయిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తే, మరికొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు. ఇంకొందరైతే కేవలం లైకులు, కామెంట్ల కోసం తమ సొంత జీవితాన్నే నవ్వులపాలు చేసుకుంటారు. కానీ, బిహార్లోని కటిహార్ జిల్లాలో ఓ ఘోర ఉదంతం వెలుగు చూసింది. భార్యపై అనుమానం, కోపం, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే తపనతో ఓ వ్యక్తి తన భార్య ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిందితుడికి 2023లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయినప్పటి నుంచి అతనికి భార్యపై విపరీతమైన అనుమానం ఉండేది. ఆమె పుట్టింటికి వెళ్లినా, ఫోన్ కాస్త ఆలస్యంగా ఎత్తినా, లేదా బంధువులతో మాట్లాడినా అతడు లేనిపోని అనుమానాలు పెంచుకునేవాడు. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే భ్రమలో బతికేవాడు. ఈ అనుమానాల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు పెరిగి, భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత కక్ష పెంచుకున్న సదరు భర్త, ఆమెను డిజిటల్గా వేధించి, సమాజంలో పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియో క్లిప్లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టాడు. తన వ్యక్తిగత జీవితం ఇలా బహిరంగం కావడంతో ఆ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
Also Read
- EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
- Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
- Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
సాధారణంగా ఇలాంటి సైబర్ నేరాల వెనుక రెండు ప్రధాన కారణాలు ఉంటాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఒకటి పగ తీర్చుకునే సైకో మనస్తత్వం, రెండు సోషల్ మీడియాలో ఎలాగైనా సరే అందరి దృష్టిని ఆకర్షించాలనే వింత కోరిక. ఈ కేసులో నిందితుడు కూడా చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫేమస్ అవ్వాలని ఆరాటపడేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ పిచ్చిలోనే అతను అన్ని హద్దులు దాటి భార్య గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడు. ఈ దారుణంపై సదరు మహిళ 2026, జనవరి 9న కటిహార్ సైబర్ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించారు. కేసు నమోదైన తర్వాత నిందితుడు కొంతకాలం పరారీలో ఉన్నప్పటికీ, పోలీసులు సాంకేతిక నిఘా సహాయంతో అతడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టినట్లు ఒప్పుకున్నాడు, కానీ భార్యపై ఉన్న కోపం, అనుమానమే దానికి కారణమని సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ ఘటనపై కటిహార్ సైబర్ డీఎస్పీ ఆశీఫ్ ఆలం స్పందిస్తూ.. “ఎవరైనా సరే, ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టప్రకారం నేరం. ఆ పని చేసింది భర్త అయినా, భార్య అయినా, స్నేహితులైనా సరే.. అవతలి వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను (Privacy) ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ ప్రైవేట్ కంటెంట్ను ఇంకా ఎక్కడెక్కడ షేర్ చేశారు, డిలీట్ చేయడానికి ఏమైనా ప్రయత్నించారా అనే కోణంలో ఆ డివైజ్ను ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- bihar
- crime
- cyber crime
- india
- Katihar
తాజావార్తలు
-
Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
-
Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
-
Mollywood Times Controversy : ‘మాలీవుడ్ టైమ్స్’ నిర్మాతలపై సెన్సార్ టీం గరం గరం… మ్యూట్ చేసిన పదాలతో సినిమా రిలీజ్
-
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!