Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం, వైరల్ అవ్వాలనే పిచ్చి ఈ రోజుల్లో మనుషులతో ఏమేం చేయిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తే, మరికొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు. ఇంకొందరైతే కేవలం లైకులు, కామెంట్ల కోసం తమ సొంత జీవితాన్నే నవ్వులపాలు చేసుకుంటారు. కానీ, బిహార్లోని కటిహార్ జిల్లాలో ఓ ఘోర ఉదంతం వెలుగు చూసింది. భార్యపై అనుమానం, కోపం, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే తపనతో ఓ వ్యక్తి తన భార్య ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిందితుడికి 2023లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయినప్పటి నుంచి అతనికి భార్యపై విపరీతమైన అనుమానం ఉండేది. ఆమె పుట్టింటికి వెళ్లినా, ఫోన్ కాస్త ఆలస్యంగా ఎత్తినా, లేదా బంధువులతో మాట్లాడినా అతడు లేనిపోని అనుమానాలు పెంచుకునేవాడు. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే భ్రమలో బతికేవాడు. ఈ అనుమానాల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు పెరిగి, భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత కక్ష పెంచుకున్న సదరు భర్త, ఆమెను డిజిటల్గా వేధించి, సమాజంలో పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియో క్లిప్లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టాడు. తన వ్యక్తిగత జీవితం ఇలా బహిరంగం కావడంతో ఆ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
Also Read
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
సాధారణంగా ఇలాంటి సైబర్ నేరాల వెనుక రెండు ప్రధాన కారణాలు ఉంటాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఒకటి పగ తీర్చుకునే సైకో మనస్తత్వం, రెండు సోషల్ మీడియాలో ఎలాగైనా సరే అందరి దృష్టిని ఆకర్షించాలనే వింత కోరిక. ఈ కేసులో నిందితుడు కూడా చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫేమస్ అవ్వాలని ఆరాటపడేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ పిచ్చిలోనే అతను అన్ని హద్దులు దాటి భార్య గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడు. ఈ దారుణంపై సదరు మహిళ 2026, జనవరి 9న కటిహార్ సైబర్ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించారు. కేసు నమోదైన తర్వాత నిందితుడు కొంతకాలం పరారీలో ఉన్నప్పటికీ, పోలీసులు సాంకేతిక నిఘా సహాయంతో అతడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టినట్లు ఒప్పుకున్నాడు, కానీ భార్యపై ఉన్న కోపం, అనుమానమే దానికి కారణమని సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ ఘటనపై కటిహార్ సైబర్ డీఎస్పీ ఆశీఫ్ ఆలం స్పందిస్తూ.. “ఎవరైనా సరే, ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టప్రకారం నేరం. ఆ పని చేసింది భర్త అయినా, భార్య అయినా, స్నేహితులైనా సరే.. అవతలి వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను (Privacy) ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ ప్రైవేట్ కంటెంట్ను ఇంకా ఎక్కడెక్కడ షేర్ చేశారు, డిలీట్ చేయడానికి ఏమైనా ప్రయత్నించారా అనే కోణంలో ఆ డివైజ్ను ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- bihar
- crime
- cyber crime
- india
- Katihar
తాజావార్తలు
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
-
Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
-
CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!