Big Twist in Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్లో బిగ్ ట్విస్ట్..!
- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..
- గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కొత్త ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Twist in Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ కేసులో తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్.. ఈ కేసులో ఇవాళ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్కు వచ్చిన ఏపీ పోలీసులు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు.. అరెస్ట్ సందర్భంగా పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారట వంశీ.. కేసు కోర్టులో ఉండగా.. తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో వాదించగా.. ఇది మరో కేసు అంటూ.. పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు..
Read Also: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!
Also Read
అయితే, తాజాగా తనకు ఆ ఫిర్యాదుతో సంబంధం లేదని కోర్టులో సత్యవర్ధన్ అఫిడవిట్ వేయటంతో.. ఫిర్యాదుదారుడ్ని బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారట పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు సత్యవర్ధన్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యవర్ధన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.. కానీ, 4 రోజుల క్రితం తన ఫిర్యాదు వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.. కేసుకు తనకి సంబంధం లేదని.. కావాలని పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం పేరుతో కేసు పెట్టారని.. పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. ఈ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనుంది విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం.. అక్కడే ఇప్పుడు రివర్స్ ట్విస్ట్ వచ్చి చేరింది..
Read Also: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!
సత్యవర్ధన్ను బెదిరించినట్లుగా సెల్ఫోన్ ఆడియో రికార్డులు పోలీసులకు లభ్యమయ్యాయి.. సత్యవర్ధన్ కులం పేరుతో బెదిరించి.. కిడ్నాప్ పాల్పడ్డట్టుగా తేల్చారు పోలీసులు.. సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు.. వంశీతో పాటు అనుచరులు బెదిరింపు వల్లే కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు సత్యవర్ధన్.. దీంతో.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసు విత్ డ్రాలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. ఈ కేసులో తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు సత్యవర్ధన్.. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది.. దీంతో, సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు.. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని సత్యవర్ధన్ చెప్పడంతో.. మరో కేసు నమోదు చేశారు.. దీనితో వల్లభనేని వంశీ ఆయన అనుచరులుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. సత్యవర్ధన్ ను ఆ రోజు కోర్టుకు తమ కారులోనే వంశీ అనుచరులు తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!