Bhatti Vikramarka : పాము పడగ నీడలో తెలంగాణ పాలన కొనసాగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా తిమ్మాజీపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాము పడగ నీడలో తెలంగాణ పాలన కొనసాగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే నిర్బంధం అడుగడుగున భయంతో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారని ఆయన అన్నారు. కొట్లాడితే కొలువులు రావన్న భయంతో నిరుద్యోగులు, ధరణిలో భూమి మాయం అవుతుందని రైతులు, పింఛన్లు బంద్ అవుతాయని పేదలు, రేషన్ కార్డులు ఇవ్వరని ప్రజలు ఇలా అనేక వర్గాలు బీఆర్ఎస్ అరాచక పాలనలో భయం భయంగా గడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమస్త తెలంగాణ సమాజం మరొకసారి ఏకం కావాలి సంపద, నీళ్ల కోసం నిలదించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. ల్యాండ్, స్యాండ్, మైన్స్, వైన్స్ దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేసే పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులకు లేదని, అసైన్డ్, మాన్యం భూములతో పాటు బొందల గడ్డ భూములను కూడా బీఆర్ఎస్ నాయకులు వదలట్లేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు పంచుతామని చెప్పి సీఎం కేసీఆర్ పేదల భూములు గుంజుకుంటుండని ఆయన అన్నారు.
Also Read : MI vs GT: శుబ్మన్ గిల్ వీరవిహారం.. ముంబై ముందు భారీ లక్ష్యం
Also Read
ఆదిలాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వరకు పాదయాత్ర చేసిన నేను చెప్తున్న ప్రతి మాటపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ను గెలిపించి తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలని ఓట్లు వేయించిన యూనివర్సిటీ విద్యార్థులు నేడు కొలువులు రాక గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళ లాగా తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయని ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపద కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పెద్దల బాగు కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోలేదని, నాలుగు కోట్ల ప్రజలు బాగుపడటానికి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, అమ్మ హస్తం పథకం ద్వారా ఇచ్చే తొమ్మిది రకాల సరుకులు ఇవ్వట్లేదు. సంచిని, సరుకులను మాయం చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందన్నారు. నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటేనే తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు.
Also Read : Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ వచ్చేది అప్పుడే..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!