Bhatti Vikramarka : పాము పడగ నీడలో తెలంగాణ పాలన కొనసాగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా తిమ్మాజీపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాము పడగ నీడలో తెలంగాణ పాలన కొనసాగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే నిర్బంధం అడుగడుగున భయంతో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారని ఆయన అన్నారు. కొట్లాడితే కొలువులు రావన్న భయంతో నిరుద్యోగులు, ధరణిలో భూమి మాయం అవుతుందని రైతులు, పింఛన్లు బంద్ అవుతాయని పేదలు, రేషన్ కార్డులు ఇవ్వరని ప్రజలు ఇలా అనేక వర్గాలు బీఆర్ఎస్ అరాచక పాలనలో భయం భయంగా గడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమస్త తెలంగాణ సమాజం మరొకసారి ఏకం కావాలి సంపద, నీళ్ల కోసం నిలదించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. ల్యాండ్, స్యాండ్, మైన్స్, వైన్స్ దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేసే పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులకు లేదని, అసైన్డ్, మాన్యం భూములతో పాటు బొందల గడ్డ భూములను కూడా బీఆర్ఎస్ నాయకులు వదలట్లేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు పంచుతామని చెప్పి సీఎం కేసీఆర్ పేదల భూములు గుంజుకుంటుండని ఆయన అన్నారు.
Also Read : MI vs GT: శుబ్మన్ గిల్ వీరవిహారం.. ముంబై ముందు భారీ లక్ష్యం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఆదిలాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వరకు పాదయాత్ర చేసిన నేను చెప్తున్న ప్రతి మాటపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ను గెలిపించి తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలని ఓట్లు వేయించిన యూనివర్సిటీ విద్యార్థులు నేడు కొలువులు రాక గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళ లాగా తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయని ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపద కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పెద్దల బాగు కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోలేదని, నాలుగు కోట్ల ప్రజలు బాగుపడటానికి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, అమ్మ హస్తం పథకం ద్వారా ఇచ్చే తొమ్మిది రకాల సరుకులు ఇవ్వట్లేదు. సంచిని, సరుకులను మాయం చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందన్నారు. నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటేనే తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు.
Also Read : Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ వచ్చేది అప్పుడే..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!