Bhaskar Reddy: నాని హైడ్రామా చేశారు.. తిరుపతి దాడి ఘటనపై భాస్కర్ రెడ్డి వీడియో ప్రజంటేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”నామినేషన్ రోజు నాపై దాడి చేశారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప, ఆయనపై దాడి చేయలేదు. కానీ దాడిని నేను కూడా ఖండిస్తున్నాను. దాడి తరవాత కూడా నాని చాలా హుషారుగా ఉన్నారు. కానీ చేతులకు, కాళ్ళకు గాయాలు అని డ్రామాలు ఆడారు. నాని భార్య సైతం ఇదే తరహాలో లేని గాయాలు సృష్టించి డ్రామాలు ఆడుతున్నారు. పులివర్తి నాని పై దాడి విషయంలో అనవసరంగా మమ్మల్ని దోషులు చేస్తున్నారు. నాని ఆడిన డ్రామాల వల్ల ఇప్పుడు ఎంతో మంది అధికారులు, నేతలు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి దాడులు సరికాదు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాడిని హుందాగా వ్యవహరిస్తాను. ఈ ఐదేళ్లు నన్ను ఎంత దూషించినా నేను స్పందించలేదు. పులివర్తి నాని దంపతులను నేను ఏనాడూ విమర్శించ లేదు. ఈ ఐదేళ్లు వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.” అని ఆయన ఉద్ఘాటించారు.
READ MORE: Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
నాని చేస్తున్న క్వారీ వ్యాపారాల జోలికి తాను ఎప్పుడూ వెళ్లలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. “నాని భార్య మమ్మల్ని వ్యక్తిగతంగా ఎన్నో దూషించారు. రెండేళ్ల ముందు నియోజకవర్గాన్ని వదిలేద్దామని అనుకున్నాను. కానీ చంద్రగిరి ప్రజలతో ఏర్పడ్డ అనుబంధాన్ని వదలలేక, నా కుమారుడిని బరిలో నిలిపాను.” అని వ్యాఖ్యానించారు. కాగా.. పోలింగ్ రోజు చంద్రగిరిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్న విషయం తెలిసిందే. ఈఘటనపై సీరియస్ అయిన ఈసీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సైతం ఏర్పాటు చేసిన విషయం విదితమే. తాజాగా కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాగం చర్యలు తీసుకుంది. విజయోత్సవ ర్యాలీలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!