Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి చాలామంది రైలు ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటే జనరల్ బోగీల్లో ప్రయాణం చేయలేక.. రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లోకి వెళ్లి ప్రయాణం చేస్తారు. అయితే ఇందులో చాలామంది కాస్త ఫైన్ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయతన్నం చేస్తారు. ఇకపోతే ఏసీ కంపార్ట్మెంట్స్ లో మాత్రం కాస్త కచ్చితంగా నిబంధనలను పాటిస్తారు అధికారులు. ముఖ్యంగా రిజర్వేషన్ కన్ఫర్మ్ కాని వారిని, అలాగే టికెట్ లేనివారందరిని ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు పంపేస్తారు.
Lok Sabha Election Phase 6: ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదు..
Also Read
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
ఇకపోతే తాజాగా, బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్ లో ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు రైలు పరిస్థితికి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ఏసీ కంపార్ట్మెంట్, జనరల్ బోగీ కంటే దారుణంగా ఉంది. ఇక ఏసీ రిజర్వేషన్ కన్ఫర్మ్ కానివారు, వారితోపాటు అసలు టికెట్ తీసుకోనివారు కూడా ఆ బోగిలోకి వచ్చేయడంతో థర్డ్ ఏసీ బోగీ కాస్తా సంత మార్కెట్ లా కనపడుతోంది.
CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్కి విజయ్కుమార్ అనే వ్యక్తి థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో మొత్తం 8 టికెట్లు బుక్ చేశారు. అందుకోసం పట్నా స్టేషన్ లో రైలు ఎక్కగానే వారి కుటుంబానికి విచిత్ర సంఘటన ఎదురైంది. వారు వచ్చే లోపే బోగీలోని సీట్లన్నీ నిండిపోయి. బోగీ మొత్తం జనం కిక్కిరిసిపోయారు. వారి సీట్స్ లో కూర్చున్న వారికి రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పినా ఎవరూ వినిపించుకునే పరిస్థితిలో లేరని., ఆ సమయంలో సాయం కోరేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో లేదంటూ వాపోయాడు. ఇక చివరికి ఎలాగో ప్రయత్నించి ఆయన 6 సీట్లు దక్కించుకున్నారు. ఇక అక్కడి పరిస్థితిని వీడియో తీసి ఎక్స్ లో పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్త అది వైరల్గా మారింది.
This is AC-3 at 15658 BRAHMAPUTRA EXP at Patna Junction. My family and I had to fight to get into the train & then to get our confirmed seat. AC-3 has been taken over by general passengers. No one cares for any rule @RailMinIndia @AshwiniVaishnaw @narendramodi @NWRailways pic.twitter.com/sVmp2bWNFV
— Vijay Kumar (@_VIJAY_KUMAR) May 24, 2024
తాజావార్తలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!