Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి చాలామంది రైలు ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటే జనరల్ బోగీల్లో ప్రయాణం చేయలేక.. రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లోకి వెళ్లి ప్రయాణం చేస్తారు. అయితే ఇందులో చాలామంది కాస్త ఫైన్ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయతన్నం చేస్తారు. ఇకపోతే ఏసీ కంపార్ట్మెంట్స్ లో మాత్రం కాస్త కచ్చితంగా నిబంధనలను పాటిస్తారు అధికారులు. ముఖ్యంగా రిజర్వేషన్ కన్ఫర్మ్ కాని వారిని, అలాగే టికెట్ లేనివారందరిని ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు పంపేస్తారు.
Lok Sabha Election Phase 6: ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదు..
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
ఇకపోతే తాజాగా, బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్ లో ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు రైలు పరిస్థితికి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ఏసీ కంపార్ట్మెంట్, జనరల్ బోగీ కంటే దారుణంగా ఉంది. ఇక ఏసీ రిజర్వేషన్ కన్ఫర్మ్ కానివారు, వారితోపాటు అసలు టికెట్ తీసుకోనివారు కూడా ఆ బోగిలోకి వచ్చేయడంతో థర్డ్ ఏసీ బోగీ కాస్తా సంత మార్కెట్ లా కనపడుతోంది.
CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్కి విజయ్కుమార్ అనే వ్యక్తి థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో మొత్తం 8 టికెట్లు బుక్ చేశారు. అందుకోసం పట్నా స్టేషన్ లో రైలు ఎక్కగానే వారి కుటుంబానికి విచిత్ర సంఘటన ఎదురైంది. వారు వచ్చే లోపే బోగీలోని సీట్లన్నీ నిండిపోయి. బోగీ మొత్తం జనం కిక్కిరిసిపోయారు. వారి సీట్స్ లో కూర్చున్న వారికి రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పినా ఎవరూ వినిపించుకునే పరిస్థితిలో లేరని., ఆ సమయంలో సాయం కోరేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో లేదంటూ వాపోయాడు. ఇక చివరికి ఎలాగో ప్రయత్నించి ఆయన 6 సీట్లు దక్కించుకున్నారు. ఇక అక్కడి పరిస్థితిని వీడియో తీసి ఎక్స్ లో పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్త అది వైరల్గా మారింది.
This is AC-3 at 15658 BRAHMAPUTRA EXP at Patna Junction. My family and I had to fight to get into the train & then to get our confirmed seat. AC-3 has been taken over by general passengers. No one cares for any rule @RailMinIndia @AshwiniVaishnaw @narendramodi @NWRailways pic.twitter.com/sVmp2bWNFV
— Vijay Kumar (@_VIJAY_KUMAR) May 24, 2024
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!