Bengaluru: నాలుగేళ్ల కొడుకును హత్య చేసి బ్యాగులో తీసుకెళ్లిన ఓ కంపెనీ సీఈఓ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కొడుకును గోవాలోని ఓ హోటల్లో హత్య చేసింది. ఆమెను కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుచనా సేత్ ఓ స్టార్టప్ కంపెనీని స్థాపించి సీఈఓగా పని చేస్తుంది.. తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఈ నెల 6వ తేదీన గోవాకు వెళ్లింది.. అక్కడ హోటల్లో రూమ్ తీసుకొని ఉంది.. ఆమె వెళ్లిన తరువాత రూమ్లో రక్తపు మరకలు కనిపించడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. ఇక, హోటల్ కు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. హోటల్ రూమ్ లోకి వచ్చినప్పుడు బాబుతో వచ్చిన ఆమె.. బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్లడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Read Also: King Nag: మహేష్, తేజా సజ్జా, వెంకీ మామా అయిపోయారు… ఇక ఇప్పుడు కింగ్ నాగ్ టైమ్
Also Read
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
దీంతో పోలీసులు ట్యాక్సీ డ్రైవర్కు ఫోన్ చేసి సదరు మహిళతో మాట్లాడారు.. తన స్నేహితుడి దగ్గర కుమారుడిని వదిలి పెట్టానని సుచనా సేత్ వివరణ ఇచ్చింది. దీంతో గోవా పోలీసులు రంగంలోకి దిగి కర్ణాటక పోలీసులను సంప్రదించారు. ఇక, విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సుచనా సేత్ బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని శవ పరీక్ష కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!