Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- బెంగాల్లో ఈసారి గెలుపు బీజేపీదేనా..?
- నాలుగు ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి, రెండు టీఎంసీకి..
- హోరాహోరీ పోరు తప్పదంటున్న సర్వేలు..
Bengal exit polls: 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి. ఈ రోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అస్సాంలో బీజేసీ, తమిళనాడులో డీఎంకే కూటమి, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని పలు ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. అయితే, దేశంలో ఎక్కువ ఆసక్తి ఉన్న పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బెంగాల్లో బీజేపీ వైపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మొగ్గు చూపాయి. ఈసారి బెంగాల్లో కాషాయ జెండా ఎగురుతుందని చెప్పాయి. ఇదే సమయం ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. 4 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం సాధిస్తుందని చెబుతుంటే, రెండు మాత్రం టీఎంసీ వైపు వెళ్లాయి. మొత్తంగా హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. 2021 బెంగాల్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఆ సమయంలో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని అంచనా వేయగా, టీఎంసీ 2015 సీట్లతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 సీట్లతో సరిపెట్టుకుంది.
Also Read
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
- Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
Read Also: Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
ప్రస్తుతం అంచనాలను చూస్తే.. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీకి 146-161 సీట్లు సాధిస్తుందని, టీఎంసీ 125-140 సీట్లకే పరిమితమవుతుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. పీమార్క్ ప్రకారం.. బీజేపీకి 150-175 సీట్లు వస్తాయని, టీఎంసీ 118-138 సీట్ల దక్కించుకుంటుందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ బెంగాల్లో బీజేపీకి 150-160 స్థానాలు గెలుస్తుందని, టీఎంసీ 130-140 సీట్లు వస్తాయని చెప్పింది. పోల్ డైరీ బీజేపీకి 142-171 స్థానాలతో ఆధిక్యంలో ఉంటుందని, టీఎంసీ 99-127 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే పీపుల్స్ పల్స్ టీఎంసీకి 177-187 సీట్లు వస్తాయని అంచనా వేయగా, జన్మత్ పోల్స్ 195-205 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జేవీసీ హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది. బీజేపీకి 138-159 సీట్లు, టీఎంసీకి 131-152 సీట్లు వస్తాయని పేర్కొంది.
తాజావార్తలు
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
-
Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
-
Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
-
TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?