Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
- బంగ్లాదేశ్లో మీజిల్స్ కేసుల పెరుగుదల
- భారత్కు ఎంతటి ముప్పు?
- లక్షణాలు గుర్తించాల్సిన సమయం
- టీకాతోనే నివారణ సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Measles Outbreak : పొరుగు దేశం బంగ్లాదేశ్లో మీజిల్స్ (తట్టు) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటంతో భారత్పై కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ, పిల్లల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుండటంతో అప్రమత్తత అవసరమని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
మీజిల్స్ అనేది ‘పారామిక్సో వైరస్’ కుటుంబానికి చెందిన వైరస్ ద్వారా వచ్చే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్. ఇది గాలి ద్వారా అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ వైరస్ కణాలు గాలిలో ఉండి, పక్కన ఉన్నవారికి సులభంగా సోకుతాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధుల్లో ఇది ఒకటి.
Also Read
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
బంగ్లాదేశ్లోని రోహింగ్యా శరణార్థుల శిబిరాల్లో , సమీప జిల్లాల్లో మీజిల్స్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. టీకా కార్యక్రమాల్లో అంతరాయం కలగడం, సరైన పోషకాహార లోపం , అధిక జనాభా సాంద్రత వల్ల ఈ వైరస్ అక్కడ మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. వందలాది మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల పాలవుతుండటం గమనార్హం.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులు దాదాపు 4,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రజలు ఉపాధి, వ్యాపారాల నిమిత్తం సరిహద్దులు దాటుతుంటారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాలు బంగ్లాదేశ్తో నేరుగా సరిహద్దును కలిగి ఉన్నాయి. వ్యాధి సోకిన వ్యక్తులు ప్రయాణాల ద్వారా భారత్లోకి ప్రవేశిస్తే, ఇక్కడ కూడా అవుట్బ్రేక్ వచ్చే ప్రమాదం ఉంది. గతంలో కూడా సరిహద్దు రాష్ట్రాల్లో మీజిల్స్ కేసులు నమోదైన దాఖలాలు ఉన్నాయి.
ముందస్తు జాగ్రత్తలు , లక్షణాలు
లక్షణాలు: తీవ్రమైన జ్వరం, దగ్గు, కళ్ళు ఎర్రబడటం, ముక్కు కారడం , శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం దీని ప్రధాన లక్షణాలు.
చికిత్స & నివారణ: మీజిల్స్కు నిర్దిష్టమైన యాంటీవైరల్ మందులు లేవు. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం ‘టీకా’ (Vaccination).
టీకా ప్రాముఖ్యత: పిల్లలకు సకాలంలో MMR (Measles, Mumps, Rubella) వ్యాక్సిన్ వేయించడం ద్వారా ఈ మహమ్మారిని అరికట్టవచ్చు.
ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని , టీకా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని భారత ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, పిల్లల్లో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
తాజావార్తలు
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!