Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maulana Salman Azhar: పాకిస్థాన్ కేంద్రంగా భారత్పై కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులకు వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ మౌలానా సల్మాన్ అజార్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దుల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ అగ్రశ్రేణి కమాండర్లలో ఒకడైన మౌలానా సల్మాన్ అజార్, బహవల్పూర్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
బహవల్పూర్లో అంత్యక్రియలు
తాజా నివేదికల ప్రకారం.. సల్మాన్ అజార్ అంత్యక్రియలు ఈరోజు (ఏప్రిల్ 29, 2026) సాయంత్రం 4 గంటలకు పాకిస్థాన్లోని బహవల్పూర్లో ఉన్న మర్కజ్ సుభానల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది జైష్ సానుభూతిపరులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదమా లేక ఎవరైనా పక్కా ప్లాన్తో చేసిన హత్యా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా గతేడాది జూన్ మాసంలో కూడా జైష్-ఎ-మొహమ్మద్కు చెందిన మరో కీలక వ్యూహకర్త మౌలానా అబ్దుల్ అజీజ్ ఈజర్ (అసర్) కూడా ఇటువంటి అనుమానాస్పద పరిస్థితుల్లోనే మరణించాడు. అజీజ్ ఈజర్ 2025 జూన్ 2న మరణించాడు. ఆయనది అధికారికంగా గుండెపోటు అని చెబుతున్నప్పటికీ, అతని మరణం వెనుక మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
2016లో జరిగిన నాగోటా ఉగ్రదాడితో సహా భారత్లో జరిగిన అనేక విధ్వంసకర దాడుల వెనుక ఈజర్ హస్తం ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో భారత్కు వ్యతిరేకంగా విషపూరిత ప్రసంగాలు చేయడంలో ఇతను సిద్ధహస్తుడు. పాకిస్థాన్ ఆశ్రయంలో ఉంటూ భారత్పై దాడులకు తెగబడే ఉగ్రవాద నేతలు వరుసగా మరణిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతేడాది అబ్దుల్ అజీజ్, ఇప్పుడు సల్మాన్ అజార్ మరణించడంతో జైష్-ఎ-మొహమ్మద్ అగ్రనాయకత్వంలో కలవరం మొదలైంది. గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో లేదా అనుమానాస్పద ప్రమాదాల్లో ఉగ్రవాదులు హతమవుతుండటంతో పాకిస్థాన్ గడ్డపై వారికి రక్షణ కరువైందనే చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!