Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- బెంగాల్లో ఈసారి గెలుపు బీజేపీదేనా..?
- నాలుగు ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి, రెండు టీఎంసీకి..
- హోరాహోరీ పోరు తప్పదంటున్న సర్వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal exit polls: 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి. ఈ రోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అస్సాంలో బీజేసీ, తమిళనాడులో డీఎంకే కూటమి, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని పలు ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. అయితే, దేశంలో ఎక్కువ ఆసక్తి ఉన్న పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బెంగాల్లో బీజేపీ వైపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మొగ్గు చూపాయి. ఈసారి బెంగాల్లో కాషాయ జెండా ఎగురుతుందని చెప్పాయి. ఇదే సమయం ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. 4 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం సాధిస్తుందని చెబుతుంటే, రెండు మాత్రం టీఎంసీ వైపు వెళ్లాయి. మొత్తంగా హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. 2021 బెంగాల్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఆ సమయంలో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని అంచనా వేయగా, టీఎంసీ 2015 సీట్లతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 సీట్లతో సరిపెట్టుకుంది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
ప్రస్తుతం అంచనాలను చూస్తే.. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీకి 146-161 సీట్లు సాధిస్తుందని, టీఎంసీ 125-140 సీట్లకే పరిమితమవుతుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. పీమార్క్ ప్రకారం.. బీజేపీకి 150-175 సీట్లు వస్తాయని, టీఎంసీ 118-138 సీట్ల దక్కించుకుంటుందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ బెంగాల్లో బీజేపీకి 150-160 స్థానాలు గెలుస్తుందని, టీఎంసీ 130-140 సీట్లు వస్తాయని చెప్పింది. పోల్ డైరీ బీజేపీకి 142-171 స్థానాలతో ఆధిక్యంలో ఉంటుందని, టీఎంసీ 99-127 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే పీపుల్స్ పల్స్ టీఎంసీకి 177-187 సీట్లు వస్తాయని అంచనా వేయగా, జన్మత్ పోల్స్ 195-205 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జేవీసీ హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది. బీజేపీకి 138-159 సీట్లు, టీఎంసీకి 131-152 సీట్లు వస్తాయని పేర్కొంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?