Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
- మెట్రోపై ప్రభుత్వ పగ్గాలు
- ₹1461 కోట్ల భారీ ఒప్పందం
- అప్పుల రీఫైనాన్స్ ప్రక్రియ
- భవిష్యత్ విస్తరణకు మార్గం సుగమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను తన పరిధిలోకి తెచ్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (LTMRHL)కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో హెచ్ఎంఆర్ఎల్ (HMRL) ఛైర్మన్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, , ఎల్ అండ్ టీ ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా షేర్ల కొనుగోలు ఒప్పందం (Share Purchase Agreement) కుదిరింది. ఈ ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు ఎల్ అండ్ టీ తరఫున డి.కె.సేన్, కేవీబీ రెడ్డిలు సంతకాలు చేశారు.
ఈ భారీ ఒప్పందంలో భాగంగా ఎల్ అండ్ టీ హామీతో ఉన్న సుమారు రూ.13,538.53 కోట్ల అప్పును ఏప్రిల్ 30, 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేయనున్నారు. ఈ చారిత్రాత్మక లావాదేవీకి ఐడీబీఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించగా, షరాఫ్ & పార్ట్నర్స్ లీగల్ అడ్వైజరీ సేవలను అందించాయి. ఈ అధికారిక ఒప్పందానికి ముందు ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చలు జరపడం గమనార్హం.
Also Read
- Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I కింద ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర నెట్వర్క్ కొనసాగుతోంది. 2017 నవంబర్లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 86 కోట్ల ప్రయాణాలు నమోదు కాగా, ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 4.50 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మెట్రో పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి రావడంతో, ప్రస్తుతం ఉన్న ఫేజ్-I , ప్రతిపాదిత ఫేజ్-II నెట్వర్క్ పనులు, ప్రణాళికలు, , విస్తరణలో మరింత మెరుగైన సమన్వయం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో నగరవాసులకు మరింత సమగ్రమైన, నమ్మదగిన , ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!