Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
- మెట్రోపై ప్రభుత్వ పగ్గాలు
- ₹1461 కోట్ల భారీ ఒప్పందం
- అప్పుల రీఫైనాన్స్ ప్రక్రియ
- భవిష్యత్ విస్తరణకు మార్గం సుగమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను తన పరిధిలోకి తెచ్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (LTMRHL)కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో హెచ్ఎంఆర్ఎల్ (HMRL) ఛైర్మన్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, , ఎల్ అండ్ టీ ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా షేర్ల కొనుగోలు ఒప్పందం (Share Purchase Agreement) కుదిరింది. ఈ ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు ఎల్ అండ్ టీ తరఫున డి.కె.సేన్, కేవీబీ రెడ్డిలు సంతకాలు చేశారు.
ఈ భారీ ఒప్పందంలో భాగంగా ఎల్ అండ్ టీ హామీతో ఉన్న సుమారు రూ.13,538.53 కోట్ల అప్పును ఏప్రిల్ 30, 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేయనున్నారు. ఈ చారిత్రాత్మక లావాదేవీకి ఐడీబీఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించగా, షరాఫ్ & పార్ట్నర్స్ లీగల్ అడ్వైజరీ సేవలను అందించాయి. ఈ అధికారిక ఒప్పందానికి ముందు ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చలు జరపడం గమనార్హం.
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I కింద ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర నెట్వర్క్ కొనసాగుతోంది. 2017 నవంబర్లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 86 కోట్ల ప్రయాణాలు నమోదు కాగా, ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 4.50 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మెట్రో పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి రావడంతో, ప్రస్తుతం ఉన్న ఫేజ్-I , ప్రతిపాదిత ఫేజ్-II నెట్వర్క్ పనులు, ప్రణాళికలు, , విస్తరణలో మరింత మెరుగైన సమన్వయం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో నగరవాసులకు మరింత సమగ్రమైన, నమ్మదగిన , ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..