Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
- మెట్రోపై ప్రభుత్వ పగ్గాలు
- ₹1461 కోట్ల భారీ ఒప్పందం
- అప్పుల రీఫైనాన్స్ ప్రక్రియ
- భవిష్యత్ విస్తరణకు మార్గం సుగమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను తన పరిధిలోకి తెచ్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (LTMRHL)కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో హెచ్ఎంఆర్ఎల్ (HMRL) ఛైర్మన్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, , ఎల్ అండ్ టీ ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా షేర్ల కొనుగోలు ఒప్పందం (Share Purchase Agreement) కుదిరింది. ఈ ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు ఎల్ అండ్ టీ తరఫున డి.కె.సేన్, కేవీబీ రెడ్డిలు సంతకాలు చేశారు.
ఈ భారీ ఒప్పందంలో భాగంగా ఎల్ అండ్ టీ హామీతో ఉన్న సుమారు రూ.13,538.53 కోట్ల అప్పును ఏప్రిల్ 30, 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేయనున్నారు. ఈ చారిత్రాత్మక లావాదేవీకి ఐడీబీఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించగా, షరాఫ్ & పార్ట్నర్స్ లీగల్ అడ్వైజరీ సేవలను అందించాయి. ఈ అధికారిక ఒప్పందానికి ముందు ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చలు జరపడం గమనార్హం.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I కింద ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర నెట్వర్క్ కొనసాగుతోంది. 2017 నవంబర్లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 86 కోట్ల ప్రయాణాలు నమోదు కాగా, ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 4.50 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మెట్రో పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి రావడంతో, ప్రస్తుతం ఉన్న ఫేజ్-I , ప్రతిపాదిత ఫేజ్-II నెట్వర్క్ పనులు, ప్రణాళికలు, , విస్తరణలో మరింత మెరుగైన సమన్వయం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో నగరవాసులకు మరింత సమగ్రమైన, నమ్మదగిన , ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?