BCCI: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పాకిస్తాన్ను ఒంటరిని చేసేందుకు బీసీసీఐ సంచలన నిర్ణయం..!
- ఆసియా కప్లో పాక్ ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం..
- సరిహద్దులో ఇటీవలి పరిణాల నేపథ్యంలో కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్.. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. పాక్ను కట్టడి చేస్తూనే.. భారత్ దాడి ముందు నిలువలేకపోయిన దయాది దేశం కాళ్ల బేరానికి వచ్చింది.. అయితే, పాకిస్తాన్కు ఈ కుట్రలు, కుయుక్తులు కొత్తకాదు.. దీంతో, ఈ సారి మరింత కఠినంగానే వ్యవహరిస్తోంది భారత్.. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ కూడా పాక్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంపైనే దృష్టిపెట్టింది.. అందులో భాగంగా ఆసియా కప్లో పాకిస్తాన్ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దులో ఇటీవలి ఘర్షణల తర్వాత పాకిస్తాన్ను ఒంటరిని చేసే ప్రయత్నంలో బీసీసీఐ కఠిన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దీర్ఘకాలిక, శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పటికే ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని తేల్చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ సంబంధాలు రెండు జట్ల మధ్య బహుళ-జట్టు ఈవెంట్లను కూడా ప్రమాదంలో పడేశాయి.
Read Also: Shahzad: మరో పాక్ గూఢచారి షాజాద్ అరెస్ట్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఆసియా ఖండంలోని క్రికెట్ వ్యవహారాలను నియంత్రించే సంస్థ అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్కు పాకిస్తాన్ మంత్రి నాయకత్వం వహిస్తున్నందున, పొరుగు దేశాన్ని మరింత ఒంటరిని చేసే ప్రయత్నంలో ఉంది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ).. ఈ సంవత్సరం ఆసియా కప్ నుండి వైదొలగాలని యోచిస్తోంది. 2025 ఆసియా కప్ భారతదేశంలో జరగాల్సి ఉంది, కానీ, పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ల నుంచి భారత్ బయటకు వస్తే.. ఆర్థిక పరంగా ఈ పోటీకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా ఈ టోర్నమెంట్ నుండి ఆదాయాన్ని ఆర్జిస్తుండగా.. ఎక్కువ క్రేజ్ ఉన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవనే చెప్పాలి.. అయితే, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే, ఆసియా కప్ కొనసాగించడానికి బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా అయిన మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని ఆసియా సంస్థ యొక్క ఆర్థిక స్థితిని ఇటువంటి పరిస్థితి దెబ్బతీస్తుంది.
Read Also: Naveen Polishetty : సంచలన దర్శకుడితో నవీన్ పోలిశెట్టి మూవీ..?
ఆసియా కప్కు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారతదేశం నుండి వస్తున్నందున, దేశంలో ప్రస్తుతం పాకిస్తాన్ వ్యతిరేక భావన కారణంగా టోర్నమెంట్ ప్లాన్ను ముందుకు తీసుకెళ్లడం BCCIకి చాలా కష్టంగా మారింది.. 2024లో, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ US డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈ సంవత్సరం ఆసియా కప్ జరగకపోతే కొత్త ఒప్పందాన్ని చేసుకోవాల్సి ఉంటుంది.. 2023 ఆసియా కప్కు హైబ్రిడ్ మోడల్ను తీసుకొచ్చారు.. టోర్నమెంట్లో కొంత భాగం శ్రీలంకలో జరిగింది. కొలంబోలో భారతదేశం టైటిల్ను గెలుచుకుంది, పాకిస్తాన్ ఫైనల్కు కూడా అర్హత సాధించలేకపోయిన విషయం విదితమే.. కాగా, ఇప్పుడును పాక్ను ఒంటరిని చేయడంపైనే భారత్ అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగిస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!