BCCI: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పాకిస్తాన్ను ఒంటరిని చేసేందుకు బీసీసీఐ సంచలన నిర్ణయం..!
- ఆసియా కప్లో పాక్ ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం..
- సరిహద్దులో ఇటీవలి పరిణాల నేపథ్యంలో కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్.. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. పాక్ను కట్టడి చేస్తూనే.. భారత్ దాడి ముందు నిలువలేకపోయిన దయాది దేశం కాళ్ల బేరానికి వచ్చింది.. అయితే, పాకిస్తాన్కు ఈ కుట్రలు, కుయుక్తులు కొత్తకాదు.. దీంతో, ఈ సారి మరింత కఠినంగానే వ్యవహరిస్తోంది భారత్.. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ కూడా పాక్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంపైనే దృష్టిపెట్టింది.. అందులో భాగంగా ఆసియా కప్లో పాకిస్తాన్ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దులో ఇటీవలి ఘర్షణల తర్వాత పాకిస్తాన్ను ఒంటరిని చేసే ప్రయత్నంలో బీసీసీఐ కఠిన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దీర్ఘకాలిక, శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పటికే ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని తేల్చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ సంబంధాలు రెండు జట్ల మధ్య బహుళ-జట్టు ఈవెంట్లను కూడా ప్రమాదంలో పడేశాయి.
Read Also: Shahzad: మరో పాక్ గూఢచారి షాజాద్ అరెస్ట్
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
ఆసియా ఖండంలోని క్రికెట్ వ్యవహారాలను నియంత్రించే సంస్థ అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్కు పాకిస్తాన్ మంత్రి నాయకత్వం వహిస్తున్నందున, పొరుగు దేశాన్ని మరింత ఒంటరిని చేసే ప్రయత్నంలో ఉంది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ).. ఈ సంవత్సరం ఆసియా కప్ నుండి వైదొలగాలని యోచిస్తోంది. 2025 ఆసియా కప్ భారతదేశంలో జరగాల్సి ఉంది, కానీ, పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ల నుంచి భారత్ బయటకు వస్తే.. ఆర్థిక పరంగా ఈ పోటీకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా ఈ టోర్నమెంట్ నుండి ఆదాయాన్ని ఆర్జిస్తుండగా.. ఎక్కువ క్రేజ్ ఉన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవనే చెప్పాలి.. అయితే, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే, ఆసియా కప్ కొనసాగించడానికి బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా అయిన మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని ఆసియా సంస్థ యొక్క ఆర్థిక స్థితిని ఇటువంటి పరిస్థితి దెబ్బతీస్తుంది.
Read Also: Naveen Polishetty : సంచలన దర్శకుడితో నవీన్ పోలిశెట్టి మూవీ..?
ఆసియా కప్కు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారతదేశం నుండి వస్తున్నందున, దేశంలో ప్రస్తుతం పాకిస్తాన్ వ్యతిరేక భావన కారణంగా టోర్నమెంట్ ప్లాన్ను ముందుకు తీసుకెళ్లడం BCCIకి చాలా కష్టంగా మారింది.. 2024లో, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ US డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈ సంవత్సరం ఆసియా కప్ జరగకపోతే కొత్త ఒప్పందాన్ని చేసుకోవాల్సి ఉంటుంది.. 2023 ఆసియా కప్కు హైబ్రిడ్ మోడల్ను తీసుకొచ్చారు.. టోర్నమెంట్లో కొంత భాగం శ్రీలంకలో జరిగింది. కొలంబోలో భారతదేశం టైటిల్ను గెలుచుకుంది, పాకిస్తాన్ ఫైనల్కు కూడా అర్హత సాధించలేకపోయిన విషయం విదితమే.. కాగా, ఇప్పుడును పాక్ను ఒంటరిని చేయడంపైనే భారత్ అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగిస్తోంది.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?