BCCI: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పాకిస్తాన్ను ఒంటరిని చేసేందుకు బీసీసీఐ సంచలన నిర్ణయం..!
- ఆసియా కప్లో పాక్ ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం..
- సరిహద్దులో ఇటీవలి పరిణాల నేపథ్యంలో కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్.. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. పాక్ను కట్టడి చేస్తూనే.. భారత్ దాడి ముందు నిలువలేకపోయిన దయాది దేశం కాళ్ల బేరానికి వచ్చింది.. అయితే, పాకిస్తాన్కు ఈ కుట్రలు, కుయుక్తులు కొత్తకాదు.. దీంతో, ఈ సారి మరింత కఠినంగానే వ్యవహరిస్తోంది భారత్.. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ కూడా పాక్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంపైనే దృష్టిపెట్టింది.. అందులో భాగంగా ఆసియా కప్లో పాకిస్తాన్ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దులో ఇటీవలి ఘర్షణల తర్వాత పాకిస్తాన్ను ఒంటరిని చేసే ప్రయత్నంలో బీసీసీఐ కఠిన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దీర్ఘకాలిక, శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పటికే ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని తేల్చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ సంబంధాలు రెండు జట్ల మధ్య బహుళ-జట్టు ఈవెంట్లను కూడా ప్రమాదంలో పడేశాయి.
Read Also: Shahzad: మరో పాక్ గూఢచారి షాజాద్ అరెస్ట్
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఆసియా ఖండంలోని క్రికెట్ వ్యవహారాలను నియంత్రించే సంస్థ అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్కు పాకిస్తాన్ మంత్రి నాయకత్వం వహిస్తున్నందున, పొరుగు దేశాన్ని మరింత ఒంటరిని చేసే ప్రయత్నంలో ఉంది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ).. ఈ సంవత్సరం ఆసియా కప్ నుండి వైదొలగాలని యోచిస్తోంది. 2025 ఆసియా కప్ భారతదేశంలో జరగాల్సి ఉంది, కానీ, పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ల నుంచి భారత్ బయటకు వస్తే.. ఆర్థిక పరంగా ఈ పోటీకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా ఈ టోర్నమెంట్ నుండి ఆదాయాన్ని ఆర్జిస్తుండగా.. ఎక్కువ క్రేజ్ ఉన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవనే చెప్పాలి.. అయితే, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే, ఆసియా కప్ కొనసాగించడానికి బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా అయిన మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని ఆసియా సంస్థ యొక్క ఆర్థిక స్థితిని ఇటువంటి పరిస్థితి దెబ్బతీస్తుంది.
Read Also: Naveen Polishetty : సంచలన దర్శకుడితో నవీన్ పోలిశెట్టి మూవీ..?
ఆసియా కప్కు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారతదేశం నుండి వస్తున్నందున, దేశంలో ప్రస్తుతం పాకిస్తాన్ వ్యతిరేక భావన కారణంగా టోర్నమెంట్ ప్లాన్ను ముందుకు తీసుకెళ్లడం BCCIకి చాలా కష్టంగా మారింది.. 2024లో, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ US డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈ సంవత్సరం ఆసియా కప్ జరగకపోతే కొత్త ఒప్పందాన్ని చేసుకోవాల్సి ఉంటుంది.. 2023 ఆసియా కప్కు హైబ్రిడ్ మోడల్ను తీసుకొచ్చారు.. టోర్నమెంట్లో కొంత భాగం శ్రీలంకలో జరిగింది. కొలంబోలో భారతదేశం టైటిల్ను గెలుచుకుంది, పాకిస్తాన్ ఫైనల్కు కూడా అర్హత సాధించలేకపోయిన విషయం విదితమే.. కాగా, ఇప్పుడును పాక్ను ఒంటరిని చేయడంపైనే భారత్ అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!