IND vs AUS: అందుకే రోహిత్, కోహ్లీ, పాండ్యాకు విశ్రాంతి ఇచ్చాం: అగార్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Agarkar explains why senior players are resting for Australia ODIs: సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం సోమవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాగా.. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు రెండు మ్యాచ్లకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను కూడా తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. ఈ నలుగురు మూడో వన్డే మ్యాచ్కు అందుబాటులో ఉంటారు.
వన్డే ప్రపంచకప్ 2023 సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ ప్లేయర్లను ఆడించకుండా.. విశ్రాంతి ఇవ్వడం ఏంటని? అందరూ భావిసున్నారు. ఇదే ప్రశ్నను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను ఓ జర్నలిస్ట్ అడిగారు. ఈ ప్రశ్నపై అగార్కర్ సమాధానం ఇస్తూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాకు చాలా కీలకం. వారికి తగినంత విశ్రాంతి అవసరం. ఆసియా కప్ 2023లో వారికి మంచి ప్రాక్టీస్ దొరికింది. కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్లోనే ఉన్నాడు. అందుకే వారికి విశ్రాంతి ఇచ్చి.. జట్టులోని మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం’ అని తెలిపాడు.
Also Read
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
Also Read: Funny Case: కోసిగి పీఎస్లో విచిత్రమైన ఫిర్యాదు.. తలలు పట్టుకున్న పోలీసులు!
‘ఇప్పుడు కీలక ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వకపోతే సుదీర్ఘంగా జరగనున్న ప్రపంచకప్లో ఏదొక దశకు చేరుకున్నాక.. మానసికంగా లేదా శారీరకంగా అలసిపోతారు. అప్పుడు స్టార్ ప్లేయర్లను పక్కన పెట్టడం చాలా ఇబ్బందిగా మారుతుంది. బ్రేక్ ఇవ్వడం వల్ల తాజాగా మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది.ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేలో ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టు ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో రిజర్వ్ బెంచ్పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం’ అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం స్వదేశంలో జరిగే మెగా టోర్నీకి భారత్ ప్రాక్టీస్ చేయనుంది.
తాజావార్తలు
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!