MLC Kavitha : సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ
- కామారెడ్డి డిక్లరేషన్ ఉల్లంఘనపై విమర్శలు
- తక్షణం రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించండి : ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై జాప్యం ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగంగా ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఏడాది గడిచినా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కవిత, బీసీ గణన అశాస్త్రీయంగా నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడం మీ ప్రాధాన్యంగా కనిపిస్తోందని విమర్శించారు.
Wife For Rent: అద్దెకు భార్యలు? ఎక్కడో కాదు మన దేశంలోనే.. ధర ఎంతంటే?
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
కుల గణన పూర్తి అయినా ఇప్పటివరకు ఆ వివరాలను బహిర్గతం చేయకపోవడం, డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధమయ్యిందని వార్తలు వస్తున్నప్పటికీ, తదుపరి కార్యాచరణపై స్పష్టత లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల అంశాలపై మీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోంది? బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చులకనగా చూస్తోందని నిలదీశారు. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకపోతే ఊరుకోమని, ఇచ్చిన హామీ కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు.
బీసీలకు ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి, 2024-25 బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేసి తొలి ఏడాదిలోనే కామారెడ్డి డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ఉల్లంఘించారని కవిత విమర్శించారు. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి ఏడాది అవుతున్నా, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా, గ్రామాల్లో ప్రజాపాలనకు బదులు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండడం దారుణమని అభిప్రాయపడ్డారు.
మీ ప్రభుత్వం త్వరగా బీసీ రిజర్వేషన్లను పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న సోయిలేని ధోరణి చూపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని కవిత విమర్శించారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే, బీఆర్ఎస్ పార్టీ మీ మెడలు వంచి హామీలను అమలు చేయించుకుంటుందని ఆమె హెచ్చరించారు.
Vizag: సాగర్ తీరంలో నకిలీ ఐఏఎస్ హల్చల్.. కిలాడీ లేడి ఆటకట్టించిన పోలీసులు
తాజావార్తలు
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!