Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Speech At Bhainsa

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే కేసీఆర్ గంపకింద కమ్ముతాడు

Published Date :November 18, 2023 , 3:51 pm
By Gogikar Sai Krishna
Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే కేసీఆర్ గంపకింద కమ్ముతాడు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

భైంసా అంటే జోష్.. సీఎం కేసీఆర్‌ ఏడికి పోయినా బీజేపి తిట్టడం తప్పా ఏం అభివృద్ధి చేశారో చెప్పడంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఔట్ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయితడని బండి సంజయ్‌ జోష్యం చెప్పారు. కేసీఆర్ పాస్ పోర్టు ల బ్రోకర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఏం చేసిందని, ఎన్నికల ముందు కేటీఆర్ కు బండి సంజయ్ అంటే లాగు తడుస్తదన్నారు. నన్ను గెలుకుతే.. నేను ఊరుకోనని, 14 వందల మంది బలి తీసుకున్నాక కాంగ్రెస్ బిల్లు పెట్టిందన్నారు. కేసీఆర్ నటించుడు కాదు. జీవిస్తాడని, తెలంగాణ రావద్దు అని కోరుకున్నాడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు.

అంతేకాకుండా.. ‘ఢిల్లీ లో మళ్లీ వచ్చేది మోది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ గాల్లో వస్తది గాల్లో పోతది. ఆరు స్కీం లు.. అర డజన్ మంది సీఎం లు.. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే కేసీఆర్ గంపకింద కమ్ముతాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో వస్తే అప్పులు, అక్రమాలు చేస్తారు. కేసీఆర్ గెలిస్తే కుటుంబ పాలన వస్తది. ముదోల్ ను దత్తత తీసుకుంటా. నేను భైంసా ను …మైసా చేస్తా అనుతుంటే బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం భైంసా చేస్తా అంటున్నారు. నేను అల్లాను ఎప్పుడు వ్యతిరేకించలేదు. ముస్లింలకు వ్యతిరేఖం కాదు. నా చేతి కాషాయ జెండా ను పాత బస్తీ తీసుకొని వెళ్ళా. పాత బస్తీకి పోతా అంటే బండి సంజయ్ భార్యను చంపుతా అన్నారు.. నా ఇద్దరు పిల్లను కిడ్నాప్ చేస్తాం అన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.

Also Read

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
  • CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
  • Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
  • Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
Add as a preferred
source on google

మేము అభివృద్ధి గురించి మాట్లాడితే సిఎం మతం గురించి మాట్లాడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేది బీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్లకు దొంగ వేషాలు వేస్తున్నారు. ముస్లిం మత పెద్ద లు గమనించండి. కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీ కి 80 శాతం ఉన్న హిందూవుల ఓట్లు వద్దా. 12 శాతం ఉన్న వాళ్లు బీహార్ లో 5 సీట్లు గెలుస్తే 80 శాతం ఉన్న హిందూవులు ముదోల్ లో ఎందుకు గెల్వదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ జెండా పట్టుకొని తిరిగిన వారిని కరీంనగర్ లో ఉరికించి కొట్టాము. రజాకార్ల రాజ్యం పోవాలి. నయా నిజాం పాలన పోవాలి. బండి సంజయ్. 3 తేదీన ఇక్కడ (భైంసా లో )విజయోత్సవ సభ జరగాలి. ఎవ్వరికి భయపడవద్దు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎం ఐ ఎం వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు. మోడీ రాజ్యం వచ్చాక మత కల్లోలాలు జరగలేదు. ఎన్నికల ముందు కేసీఆర్ ఓవైసీ మామ అల్లుళ్లు. ఎన్నికల తరువాత అన్నదమ్ములు.’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • breaking news
  • latest news
  • telangana elections 2023
  • telugu news

తాజావార్తలు

  • JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !

  • Tollywood : సమ్మర్‌ అంటే భయపడిపోతున్న స్టార్స్‌

  • CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions