Bandi Sanjay: మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ‘‘ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం చేస్తే మహిళల మాన, ప్రాణాలకంటే ఒకవర్గం వాళ్ల ఫర్నీచర్, షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరించడం సిగ్గు చేటు’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గాంధీ ఆసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జైనూర్ ఆదివాసీ మహిళను కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా దాడికి గురవడం చూసి సంజయ్ నిశ్చేష్టులయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Read Also: Khammam: రేపు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల పర్యటన
Also Read
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
ఆమె ఆరోగ్య పరిస్థితి బాధాకరమని, ఆమె మొహంపై తీవ్ర గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారని బండి సంజయ్ తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించకుండా.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జైనూరులో ముస్లిం దుకాణాలు దగ్ధమయ్యాయని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. బాధితురాలికి సత్వర న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. జైనూరులో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను ప్రభుత్వం అదుపు చేయాలని పేర్కొన్నారు. జైనూరులో జరుగుతున్న గొడవలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పోలీసులు పక్షపాత వైఖరి విడనాడాలని.. ఇప్పటికీ అనేక ఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆదివాసీ మహిళా పై జరిగిన దాడికి సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. చెరువు ఆక్రమణల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. మంత్రి సీతక్క బాధితురాలిపై అత్యాచారం జరగలేదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!