Bandi Sanjay: మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ‘‘ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం చేస్తే మహిళల మాన, ప్రాణాలకంటే ఒకవర్గం వాళ్ల ఫర్నీచర్, షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరించడం సిగ్గు చేటు’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గాంధీ ఆసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జైనూర్ ఆదివాసీ మహిళను కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా దాడికి గురవడం చూసి సంజయ్ నిశ్చేష్టులయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Read Also: Khammam: రేపు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల పర్యటన
Also Read
- IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
- Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
ఆమె ఆరోగ్య పరిస్థితి బాధాకరమని, ఆమె మొహంపై తీవ్ర గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారని బండి సంజయ్ తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించకుండా.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జైనూరులో ముస్లిం దుకాణాలు దగ్ధమయ్యాయని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. బాధితురాలికి సత్వర న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. జైనూరులో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను ప్రభుత్వం అదుపు చేయాలని పేర్కొన్నారు. జైనూరులో జరుగుతున్న గొడవలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పోలీసులు పక్షపాత వైఖరి విడనాడాలని.. ఇప్పటికీ అనేక ఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆదివాసీ మహిళా పై జరిగిన దాడికి సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. చెరువు ఆక్రమణల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. మంత్రి సీతక్క బాధితురాలిపై అత్యాచారం జరగలేదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు
తాజావార్తలు
-
IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!